Last Updated:
దేశంలో ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజలకు, వ్యాపారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) మరో షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే (కమర్షియల్) ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
ఎల్పీజీ వినియోగదారులకు మరోసారి ధరల భారం పెరిగింది. సెప్టెంబర్ ప్రారంభం నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరించాయి. పలు నగరాల్లో ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లు, ఇతర వాణిజ్య సంస్థలకు అదనపు ఖర్చు తప్పడం లేదు. అయితే గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇది సాధారణ వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు.

