ప్రభన్యూస్

Dhanush: ‘అప్పుడు ఎవరూ మాట్లాడలేదు.. ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు’.. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ధనుష్..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేస్తున్న ఆయనకు ఇటీవల మరో అరుదైన గౌరవం దక్కింది.

News18
News18

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేస్తున్న ఆయనకు ఇటీవల మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ చిత్రానికి జాతీయ చలనచిత్ర అవార్డు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ అవార్డు ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా తమిళ సినీ అభిమానులు, సినీ విశ్లేషకుల్లో కొందరు ఈ ఎంపికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.

చాలామంది అభిప్రాయం ప్రకారం, గత ఏడాది విడుదలైన ‘మెయ్యళగన్’ (తెలుగులో ‘సత్యం సుందరం’), ‘మహారాజ’ వంటి చిత్రాలు కథ, భావోద్వేగాలు, నటన పరంగా మరింత బలంగా ఉన్నాయని, అలాంటి సినిమాలు ఉన్నప్పుడు ‘రాయన్’కు జాతీయ అవార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కొందరు నెటిజన్లు అయితే ఈ అవార్డు పూర్తిగా ధనుష్ స్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఈ అంశం పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది.

ఈ వివాదంపై తాజాగా ధనుష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చిన అవార్డును సమర్థించడమే కాకుండా, గతంలో తనకు జరిగిన అన్యాయం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఒకవైపు ‘మెయ్యళగన్’, ‘మహారాజ’ మంచి సినిమాలేనని అంగీకరిస్తూనే, తన కెరీర్‌లో ఎన్నో గొప్ప చిత్రాలు సరైన గుర్తింపు పొందలేదని గుర్తు చేశారు.

ధనుష్ మాట్లాడుతూ, ‘మెయ్యళగన్, మహారాజ అద్భుతమైన సినిమాలు. అవి మంచి చిత్రాలనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నా కెరీర్‌లో వచ్చిన పుదుపేట్టై, వడ చెన్నై, కర్ణన్, మరియాన్, రాంఝణా వంటి సినిమాలు విడుదలైనప్పుడు కూడా జాతీయ అవార్డులకు అర్హత ఉన్నాయని చాలామంది భావించారు. అయితే ఆ సమయంలో నాకు మద్దతుగా ఎవరూ గట్టిగా మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం నా అవార్డును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది’ అని అన్నారు.

అంతేకాకుండా, ‘ఈ రోజు నా జాతీయ అవార్డును దాదాపు 90 శాతం మంది ప్రశ్నిస్తున్నారు. కానీ గతంలో నిజంగా అవార్డులు రావాల్సిన నా సినిమాలకు గుర్తింపు దక్కకపోయినప్పుడు కనీసం 10 శాతం మంది కూడా నా తరఫున మాట్లాడలేదు. నేను ఎవరినీ తప్పుబట్టడం లేదు. విమర్శించడానికి బదులుగా కళాకారులను ప్రోత్సహించండి’ అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు.

ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. కొందరు ఆయన అభిప్రాయానికి మద్దతు తెలుపుతూ, గతంలో ఆయన నటించిన అనేక చిత్రాలు నిజంగానే జాతీయ స్థాయి గుర్తింపుకు అర్హమైనవేనని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం అవార్డుల ఎంపికపై తమ సందేహాలను మరోసారి వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా, ధనుష్ స్పందనతో జాతీయ అవార్డుల ఎంపికపై జరుగుతున్న చర్చ మరోసారి వేడెక్కింది. అవార్డుల కంటే ఒక నటుడి ప్రతిభ, కాలానుగుణంగా ప్రేక్షకుల ఆదరణే అసలైన గుర్తింపు అని చెప్పేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 July 2026, 11:06 pm Digital Edition : Prabhanews
Dhanush: ‘అప్పుడు ఎవరూ మాట్లాడలేదు.. ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు’.. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ధనుష్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 26, 2026 11:01 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేస్తున్న ఆయనకు ఇటీవల మరో అరుదైన గౌరవం దక్కింది. News18కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేస్తున్న ఆయనకు ఇటీవల మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' చిత్రానికి జాతీయ చలనచిత్ర అవార్డు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ అవార్డు ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా తమిళ సినీ అభిమానులు, సినీ విశ్లేషకుల్లో కొందరు ఈ ఎంపికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.చాలామంది అభిప్రాయం ప్రకారం, గత ఏడాది విడుదలైన 'మెయ్యళగన్' (తెలుగులో 'సత్యం సుందరం'), 'మహారాజ' వంటి చిత్రాలు కథ, భావోద్వేగాలు, నటన పరంగా మరింత బలంగా ఉన్నాయని, అలాంటి సినిమాలు ఉన్నప్పుడు 'రాయన్'కు జాతీయ అవార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కొందరు నెటిజన్లు అయితే ఈ అవార్డు పూర్తిగా ధనుష్ స్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఈ అంశం పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది.#Dhanush on National Award Controversy 👀"Raayan vida Meiyazhagan & Maharaja better films dhaan... Aana Pudhupettai, Vada Chennai, Karnan, Maryan, & Raanjhanaa National Award miss pannapo yaarum pesaala.""Inniku 90% oppose panraanga... Appo 10% kooda support pannala. Thatti… pic.twitter.com/zxyqwEZqC6— Gv (@gowtham0725) July 26, 2026ఈ వివాదంపై తాజాగా ధనుష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చిన అవార్డును సమర్థించడమే కాకుండా, గతంలో తనకు జరిగిన అన్యాయం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఒకవైపు 'మెయ్యళగన్', 'మహారాజ' మంచి సినిమాలేనని అంగీకరిస్తూనే, తన కెరీర్‌లో ఎన్నో గొప్ప చిత్రాలు సరైన గుర్తింపు పొందలేదని గుర్తు చేశారు.ధనుష్ మాట్లాడుతూ, 'మెయ్యళగన్, మహారాజ అద్భుతమైన సినిమాలు. అవి మంచి చిత్రాలనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నా కెరీర్‌లో వచ్చిన పుదుపేట్టై, వడ చెన్నై, కర్ణన్, మరియాన్, రాంఝణా వంటి సినిమాలు విడుదలైనప్పుడు కూడా జాతీయ అవార్డులకు అర్హత ఉన్నాయని చాలామంది భావించారు. అయితే ఆ సమయంలో నాకు మద్దతుగా ఎవరూ గట్టిగా మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం నా అవార్డును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది' అని అన్నారు.అంతేకాకుండా, 'ఈ రోజు నా జాతీయ అవార్డును దాదాపు 90 శాతం మంది ప్రశ్నిస్తున్నారు. కానీ గతంలో నిజంగా అవార్డులు రావాల్సిన నా సినిమాలకు గుర్తింపు దక్కకపోయినప్పుడు కనీసం 10 శాతం మంది కూడా నా తరఫున మాట్లాడలేదు. నేను ఎవరినీ తప్పుబట్టడం లేదు. విమర్శించడానికి బదులుగా కళాకారులను ప్రోత్సహించండి' అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు.ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. కొందరు ఆయన అభిప్రాయానికి మద్దతు తెలుపుతూ, గతంలో ఆయన నటించిన అనేక చిత్రాలు నిజంగానే జాతీయ స్థాయి గుర్తింపుకు అర్హమైనవేనని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం అవార్డుల ఎంపికపై తమ సందేహాలను మరోసారి వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా, ధనుష్ స్పందనతో జాతీయ అవార్డుల ఎంపికపై జరుగుతున్న చర్చ మరోసారి వేడెక్కింది. అవార్డుల కంటే ఒక నటుడి ప్రతిభ, కాలానుగుణంగా ప్రేక్షకుల ఆదరణే అసలైన గుర్తింపు అని చెప్పేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,TelanganaFirst Published :Jul 26, 2026 11:01 PM ISTమరింత చదవండి

Source link