“ఈవీలు, హైడ్రోజన్, నేచురల్ గ్యాస్ వాహనాలకు ఐదేళ్ల అదనపు గడువు ఇవ్వాలన్న ప్రతిపాదన స్వాగతించదగ్గది. కానీ కాలుష్యం తగ్గించే రవాణా విధానం ఒక టెక్నాలజీకే పరిమితం కాకూడదు. ఆటో ఎల్పీజీని కూడా ఇందులో చేర్చాలి. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న, నిరూపితమైన, ఖర్చు తక్కువగా ఉండే ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్. ప్రస్తుతం వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. సరైన పెట్రోల్ వాహనాలను ఆటో ఎల్పీజీకి మార్చడం ద్వారా కూడా దీనిని చేయొచ్చు” అని ఇండియన్ ఆటో ఎల్పీజీ కోలిషన్ డైరెక్టర్ జనరల్ సుయశ్ గుప్తా చెప్పారు. “క్లీన్ ట్రాన్స్పోర్ట్ను ప్రోత్సహించడమే లక్ష్యమైతే, కాలుష్య ఉద్గారాలు, భద్రత, ఖర్చు, మౌలిక సదుపాయాల లభ్యత, దేశ ఇంధన భద్రతకు అందించే ప్రయోజనం వంటి అంశాల ఆధారంగా అర్హత ఉన్న ప్రతి టెక్నాలజీకి అవకాశం ఇవ్వాలి” అని ఆయన అన్నారు. ఆటో ఎల్పీజీ వాహనాలకు వయసు పరిమితిలో ఐదేళ్ల పొడిగింపు ఇచ్చినా, అవి తప్పనిసరిగా ఫిట్నెస్, సేఫ్టీ, ఎమిషన్తో పాటు ఇతర ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని ఐఏసీ స్పష్టం చేసింది. భారత్లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై నడుస్తున్న సమయంలో, రవాణా రంగాన్ని మరింత క్లీన్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఏసీ ఈ ప్రతిపాదన చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
