పీఎం సూర్య ఘర్ ముఫ్త్ యోజన అనేది ఇంటి పైకప్పుపై సోలార్ ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం. సిస్టమ్ సామర్థ్యాన్ని బట్టి గరిష్ఠంగా రూ.78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. దీంతో ప్రారంభ పెట్టుబడి తగ్గడంతో పాటు విద్యుత్ బిల్లులపై ఆదా పెరుగుతుంది. అదనంగా, నెట్ మీటరింగ్ ద్వారా అవసరానికి మించి ఉత్పత్తి చేసిన విద్యుత్ను గ్రిడ్కు పంపించి బిల్లు క్రెడిట్లు పొందే అవకాశం ఉంటుంది. నెలకు సుమారు రూ.2,000 విద్యుత్ బిల్లు చెల్లించే కుటుంబాల్లో సాధారణంగా 3 నుంచి 4 ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్లు, ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మెషిన్, మొబైల్ ఛార్జర్లు, ల్యాప్టాప్లు, వాటర్ ప్యూరిఫైయర్, మిక్సీ వంటి పరికరాలు ఉంటాయి. కొన్ని ఇళ్లలో ఇన్వర్టర్ కూడా ఉంటుంది. ఇలాంటి కుటుంబాల్లో నెలకు సుమారు 250 నుంచి 300 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం ఉండొచ్చు. ఈ అవసరానికి 3 కిలోవాట్ రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ సరిపోతుంది. దీనికి సుమారు 180 నుంచి 220 చదరపు అడుగుల నీడలేని పైకప్పు అవసరం. మొత్తం వ్యవస్థకు సుమారు రూ.2.1 లక్షల వరకు ఖర్చవుతుంది. పీఎం సూర్య ఘర్ యోజన కింద సబ్సిడీ పొందిన తర్వాత ఖర్చు సుమారు రూ.1.32 లక్షల వరకు తగ్గవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

