మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ప్రస్తుతం చాలామందిలో కనిపించే సమస్య. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి శరీరంలో నీరు తగ్గడం, ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, కొన్ని పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తరచూ తీసుకోవడం వంటి కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా రోజంతా తగినంత నీరు తాగకపోతే మూత్రం గాఢంగా మారి, అందులోని కొన్ని ఖనిజాలు కలిసి చిన్న చిన్న స్ఫటికాలుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి క్రమంగా పెద్దవై కిడ్నీ రాళ్లుగా మారవచ్చని డాక్టర్ సందీప్ హరకర్ తెలిపారు. అయితే, ప్రతి ఒక్కరిలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు ఒకేలా ఉండవు.

