Last Updated:
నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఐదో రోజుకు చేరుకున్న సహాయక చర్యల్లో మృతుల సంఖ్య 781కి పెరిగింది. ఇంకా 2,500 మందికి పైగా ఆచూకీ దొరకకపోవడంతో బతికి బయటపడిన వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
నేపాల్లో ప్రకృతి సృష్టించిన వరద విలయం మునుపెన్నడూ చూడని మహా విషాదాన్ని మిగిల్చింది. హిమానీనదాలు కరిగి, ఆకస్మికంగా విరుచుకుపడిన వరదలతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వరదలు బీభత్సం సృష్టించి ఐదు రోజులు గడుస్తున్నా.. నేపాల్ ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు. తాజా అధికారిక లెక్కల ప్రకారం ఈ మహా ప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 781కి చేరింది. బురద, శిథిలాల కింద ఇంకా వందలాది మృతదేహాలు కూరుకుపోయి ఉండే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

