Last Updated:
ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ.. హైసెక్యూరిటీ ప్రాంతంలో అనుమానాస్పద పరిణామం కలకలం రేపింది. క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు కొన్ని గంటల ముందు భద్రతాపరంగా కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) వద్ద ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు తాను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారినంటూ చెప్పుకున్నట్లు సమాచారం. అతని వద్ద నకిలీ PMO గుర్తింపు కార్డు ఉండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించడంతో అనుమానం మరింత బలపడింది.

