Last Updated:
PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ పని తీరును ప్రశంసిస్తూ ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు. భారత్ జీడీపీ వృద్ధిపై దేశ ప్రజల పాత్ర కీలకమైనదిగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త సంఘర్షణలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ 7.8 శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధించడం ద్వారా భారతదేశం తన సత్తాను చాటుకుందన్నారు.
PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ పని తీరును ప్రశంసిస్తూ ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు. భారత్ జీడీపీ వృద్ధిపై దేశ ప్రజల పాత్ర కీలకమైనదిగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త సంఘర్షణలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ 7.8 శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధించడం ద్వారా భారతదేశం తన సత్తాను చాటుకుందన్నారు. ఈ అద్భుతమైన పనితీరుకు దేశాన్ని అభినందిస్తూ కొన్ని విషయాలపై మాట్లాడారు. కోవిడ్-19 కాలం నుండి ప్రపంచమంతా అస్థిరతతో సతమతమవుతుండగా దేశీయంగా నిరాశావాదాన్ని, అబద్ధాలను ప్రచారం చేయాలని చూసిన వారిని పక్కనపెట్టి భారతదేశం ఈ కీలకమైన ముందడుగు వేసిందని పేర్కొన్నారు.

