సాంసంగ్ 8వ తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు అయిన గెలాక్సీ Z ఫోల్డ్8 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్8, గెలాక్సీ Z ఫ్లిప్8 భారత్లో ప్రీ-ఆర్డర్లలో కొత్త రికార్డు సృష్టించాయి. జూలై 22న భారత్లో లాంచ్ అయిన ఈ ఫోన్లకు కేవలం 72 గంటల్లోనే 2,71,000కు పైగా ప్రీ-ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ మూడు కొత్త ఫోల్డబుల్ ఫోన్లకు వచ్చిన మొత్తం ప్రీ-ఆర్డర్లలో 45 శాతం టియర్-2 నగరాలు, వాటి కంటే చిన్న ప్రాంతాల నుంచి వచ్చాయి. ఈ అద్భుతమైన స్పందనతో, ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన S26 సిరీస్కు వచ్చిన ప్రీ-ఆర్డర్ల స్థాయిని కూడా ఫోల్డబుల్ ఫోన్లు అందుకుంటాయని సాంసంగ్ విశ్వాసం వ్యక్తం చేసింది. రోజంతా కంటెంట్ చూసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని గెలాక్సీ Z ఫోల్డ్8ను రూపొందించారు. ఇందులో ఉన్న 10:16 కవర్ డిస్ప్లే వల్ల మెసేజ్లు పంపడం, బ్రౌజింగ్ చేయడం, షార్ట్ వీడియోలు చూడడం సాధారణ స్మార్ట్ఫోన్లా అనిపిస్తుంది. 4:3 ప్రధాన డిస్ప్లేను తెరిచిన తర్వాత చదవడం, గేమింగ్, స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులకు పెద్ద స్క్రీన్ లభిస్తుంది. ఫోన్ను తిప్పితే ఆర్టికల్స్, ఈ-బుక్స్ చదవడానికి మరింత అనువుగా ఉంటుంది. (image: Samsung India)

