Last Updated:
లలితా జ్యువెలరీ ఐపీఓకు భారీ స్పందన వచ్చింది. ఈ ఐపీఓ 63 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. లిస్టింగ్ రోజున 20% లాభం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ అంచనా.
లలితా జ్యువెలరీ ఐపీఓకు భారీ స్పందన వచ్చింది. రూ.1,700 కోట్ల విలువైన ఈ ఐపీఓ చివరి రోజు ముగిసే సమయానికి ఏకంగా 63 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. గ్రే మార్కెట్లో కూడా ఈ షేరుకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. దీంతో లిస్టింగ్ రోజున ఇన్వెస్టర్లకు దాదాపు 20 శాతం లాభం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ అంచనా వేస్తోందని మనీకంట్రోల్ కథనం వెల్లడించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) డేటా ప్రకారం, ఆగస్టు 19 సాయంత్రం 5 గంటల సమయానికి లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓ 62.97 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓలో అందుబాటులో ఉన్న 6,27,61,403 షేర్లకు గాను మొత్తం 3,95,20,82,776 షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీలు) నుంచి అత్యధిక స్పందన వచ్చింది. వారి కోటా 145.38 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ఐఐలు) కోటా 73.89 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 11.81 రెట్లు సబ్స్క్రైబ్ అయింది.

