Last Updated:
Railway Projects: ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ చెప్పింది. ఏపీ–తమిళనాడు మధ్య కీలకమైన గుమ్మిడిపూండి–గూడూరు రైల్వే మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 90 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుతో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడంతో పాటు ఏపీ నుంచి తమిళనాడు, దక్షిణ భారతంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు, సరకు రవాణాకు మరింత మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్కు కీలక ప్రయోజనం కలిగేలా కేంద్ర ప్రభుత్వం భారీ రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఏపీ, తమిళనాడు మధ్య ఉన్న గుమ్మిడిపూండి–గూడూరు రైల్వే మార్గంలో 3వ, 4వ లైన్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు సుమారు 90 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. దీంతో ఈ కీలక మార్గంలో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడంతో పాటు ప్రయాణికుల రైళ్లు, సరకు రైళ్లకు మరింత మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఏపీ నుంచి దక్షిణ భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలకు రైలు రవాణా మరింత సులభతరం అయ్యే అవకాశం ఉంది.

