ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగం, చదువులు లేదా వినోదం కోసం గంటల తరబడి మొబైల్, కంప్యూటర్, ల్యాప్టాప్లను ఉపయోగిస్తున్నారు. స్క్రీన్ను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి, అది క్రమంగా తలనొప్పికి దారితీస్తుంది. ఇదే సమయంలో సరిపడా నిద్ర లేకపోవడం కూడా మరో ప్రధాన కారణం. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర లేకపోతే మెదడు, శరీరం పూర్తిగా విశ్రాంతి పొందక మరుసటి రోజు తలనొప్పి వేధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

