ప్రభన్యూస్

Gratuity Rules: 5 ఏళ్ల సర్వీస్ తర్వాత మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా? గ్రాట్యుటీ ఫార్ములా ఇదే | బిజినెస్


Last Updated:

Gratuity Rules | గ్రాట్యుటీ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ ప్రైవేట్ ఉద్యోగులు కూడా గ్రాట్యుటీ పొందవచ్చు. 5 ఏళ్ల సర్వీస్ తర్వాత గ్రాట్యుటీ వస్తుంది. గ్రాట్యుటీ అర్హతలేంటో, ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి.

Gratuity Rules: 5 ఏళ్ల సర్వీస్ తర్వాత మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా? గ్రాట్యుటీ ఫార్ములా ఇదే (ప్రతీకాత్మక చిత్రం)
Gratuity Rules: 5 ఏళ్ల సర్వీస్ తర్వాత మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా? గ్రాట్యుటీ ఫార్ములా ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

ఇండియాలో ఉద్యోగం చేసే చాలా మందికి గ్రాట్యుటీ అనేది రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఉపయోగపడే ముఖ్యమైన ప్రయోజనం. ఇది కేవలం ఉద్యోగం ముగిసిన తర్వాత వచ్చే డబ్బు మాత్రమే కాదు. ఒక సంస్థలో చాలా కాలం పనిచేసిన ఉద్యోగికి ఇచ్చే చట్టబద్ధమైన ఆర్థిక గుర్తింపు కూడా. గ్రాట్యుటీ ఎలా లెక్కిస్తారు, ఎవరికి వస్తుంది, ఎప్పుడు ఇవ్వాలి, ఏ సందర్భాల్లో నిలిపివేయొచ్చు అనే విషయాలు తెలుసుకోవడం అవసరం. హైదరాబాద్‌కు చెందిన అఖిల్ కంచర్ల అండ్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, చార్టర్డ్ అకౌంటెంట్ అఖిల్ కంచర్ల న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ, గ్రాట్యుటీ అనేది కేవలం రిటైర్మెంట్ సమయంలో ఇచ్చే చెల్లింపు మాత్రమే కాదని చెప్పారు. “గ్రాట్యుటీ అనేది ఉద్యోగి ఒక సంస్థకు చాలా కాలం చేసిన సేవను గుర్తించే చట్టబద్ధమైన ఆర్థిక ప్రయోజనం. దీని కోసం మొత్తం ఖర్చును యజమానే భరిస్తారు. ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి కోత ఉండదు. అందుకే రిటైర్మెంట్ సమయంలో లేదా ఉద్యోగం మారే సమయంలో ఇది మంచి ఆర్థిక సహాయంగా ఉంటుంది” అని ఆయన తెలిపారు.

భారతదేశంలో ఉద్యోగులకు అందే ముఖ్యమైన చట్టబద్ధమైన రిటైర్మెంట్ ప్రయోజనాల్లో గ్రాట్యుటీ ఒకటి. ఇది ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడమే కాకుండా, ఒకే సంస్థలో దీర్ఘకాలం పనిచేసినందుకు గుర్తింపుగా కూడా ఉంటుంది. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972 ప్రకారం, అర్హత ఉన్న ఉద్యోగికి రిటైర్మెంట్, రాజీనామా, ఉద్యోగం ముగిసినప్పుడు లేదా మరణం, శాశ్వత వైకల్యం జరిగినప్పుడు యజమాని ఒకేసారి లంప్‌సమ్ రూపంలో గ్రాట్యుటీ చెల్లించాలి.

గ్రాట్యుటీకి ఎవరు అర్హులు?

పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972 ప్రకారం, 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ఫ్యాక్టరీలు, గనులు, ఆయిల్‌ఫీల్డ్స్, ప్లాంటేషన్స్, పోర్టులు, రైల్వేలు, షాపులు, ఇతర సంస్థలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఒకసారి ఈ చట్టం ఏదైనా సంస్థకు వర్తిస్తే, తర్వాత ఉద్యోగుల సంఖ్య 10 కంటే తక్కువకు తగ్గినా కూడా ఆ చట్టం అమల్లోనే ఉంటుంది. అదే యజమాని వద్ద వరుసగా ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హుడు అవుతాడు. అయితే ఉద్యోగి మరణించినా లేదా శాశ్వత వైకల్యం వచ్చినా ఐదేళ్ల సేవ నిబంధన వర్తించదు. అలాంటి సందర్భాల్లో ఉద్యోగి లేదా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా చట్టం అవకాశం కల్పించింది. అలాగే ఆమోదించిన సెలవులు, లేఆఫ్స్, ఉద్యోగి నియంత్రణలో లేని సమ్మెలు, లాక్‌అవుట్లు కూడా నిరంతర సేవలో భాగంగానే పరిగణిస్తారు.

గ్రాట్యుటీ ఎలా లెక్కిస్తారు?

చట్టం ప్రకారం గ్రాట్యుటీని ఓ ఫార్ములాతో లెక్కిస్తారు. గ్రాట్యుటీ = (15 × చివరిగా తీసుకున్న జీతం × ఉద్యోగం చేసిన సంవత్సరాలు) ÷ 26. ఇక్కడ చివరిగా తీసుకున్న జీతంలో బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఇతర అలవెన్సులు లేదా గ్రాస్ సాలరీలోని మిగతా భాగాలు లెక్కలోకి రావు. “చాలా మంది ఉద్యోగులు గ్రాట్యుటీని మొత్తం గ్రాస్ సాలరీపై లెక్కిస్తారని అనుకుంటారు. అది పెద్ద అపోహ. చట్టం ప్రకారం గ్రాట్యుటీ లెక్కించే సమయంలో చివరిగా తీసుకున్న బేసిక్ శాలరీ, డియర్‌నెస్ అలవెన్స్ మాత్రమే పరిగణిస్తారు. అలాగే కొన్ని పరిమిత సందర్భాల్లో మాత్రమే గ్రాట్యుటీని నిలిపివేయవచ్చు. ఉదాహరణకు యజమాని ఆస్తికి ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించడం, హింసాత్మక ప్రవర్తన కారణంగా ఉద్యోగం నుంచి తొలగించడం లేదా ఉద్యోగంలో ఉన్న సమయంలో నైతికంగా తీవ్రమైన నేరం చేయడం వంటి సందర్భాలు. అలాంటి పరిస్థితుల్లో కూడా యజమాని చట్టపరమైన ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలి” అని ఆయన వివరించారు. కేవలం రాజీనామా చేయడం లేదా చిన్నపాటి క్రమశిక్షణా ఉల్లంఘనల కారణంగా యజమాని గ్రాట్యుటీని నిలిపివేయడానికి హక్కు ఉండదు.

యజమాని చట్టపరమైన బాధ్యత ఏమిటి?

ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హత సాధించిన తర్వాత, ఉద్యోగి ప్రత్యేకంగా దరఖాస్తు చేయకపోయినా యజమాని గ్రాట్యుటీ చెల్లించడం చట్టబద్ధమైన బాధ్యత. చట్టం ప్రకారం గ్రాట్యుటీని 30 రోజుల్లోపు చెల్లించాలి. ఆలస్యమైతే వడ్డీ కూడా చెల్లించాల్సి రావచ్చు. అందుకే సమయానికి చెల్లించడం యజమాని బాధ్యత. గ్రాట్యుటీ ప్రస్తుతం అత్యంత పన్ను ప్రయోజనం ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో ఒకటి. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని వర్తించే నిబంధనలకు లోబడి రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీకి పన్ను మినహాయింపు ఉంది. రిటైర్మెంట్ ప్లానింగ్‌పై అవగాహన పెరుగుతున్న ఈ సమయంలో, ఉద్యోగుల హక్కుల గురించి తెలుసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో గ్రాట్యుటీ ఉద్యోగి విశ్వాసానికి గుర్తింపుగా ఉండటమే కాకుండా, రిటైర్మెంట్ సమయంలో లేదా ఉద్యోగ జీవితంలో కీలక మార్పుల సమయంలో ఆర్థికంగా అండగా నిలిచే ముఖ్యమైన భద్రతా ప్రయోజనంగా కొనసాగుతోంది. Expert Advice by: CA Akhil Kancherla, Akhil Kancherla & Associates, 8143232113, akandassociates2025@gmail.com



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 July 2026, 9:32 pm Digital Edition : Prabhanews
Gratuity Rules: 5 ఏళ్ల సర్వీస్ తర్వాత మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా? గ్రాట్యుటీ ఫార్ములా ఇదే | బిజినెస్

Last Updated:Jul 30, 2026 5:15 PM ISTGratuity Rules | గ్రాట్యుటీ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ ప్రైవేట్ ఉద్యోగులు కూడా గ్రాట్యుటీ పొందవచ్చు. 5 ఏళ్ల సర్వీస్ తర్వాత గ్రాట్యుటీ వస్తుంది. గ్రాట్యుటీ అర్హతలేంటో, ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి.Gratuity Rules: 5 ఏళ్ల సర్వీస్ తర్వాత మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా? గ్రాట్యుటీ ఫార్ములా ఇదే (ప్రతీకాత్మక చిత్రం)ఇండియాలో ఉద్యోగం చేసే చాలా మందికి గ్రాట్యుటీ అనేది రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఉపయోగపడే ముఖ్యమైన ప్రయోజనం. ఇది కేవలం ఉద్యోగం ముగిసిన తర్వాత వచ్చే డబ్బు మాత్రమే కాదు. ఒక సంస్థలో చాలా కాలం పనిచేసిన ఉద్యోగికి ఇచ్చే చట్టబద్ధమైన ఆర్థిక గుర్తింపు కూడా. గ్రాట్యుటీ ఎలా లెక్కిస్తారు, ఎవరికి వస్తుంది, ఎప్పుడు ఇవ్వాలి, ఏ సందర్భాల్లో నిలిపివేయొచ్చు అనే విషయాలు తెలుసుకోవడం అవసరం. హైదరాబాద్‌కు చెందిన అఖిల్ కంచర్ల అండ్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, చార్టర్డ్ అకౌంటెంట్ అఖిల్ కంచర్ల న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ, గ్రాట్యుటీ అనేది కేవలం రిటైర్మెంట్ సమయంలో ఇచ్చే చెల్లింపు మాత్రమే కాదని చెప్పారు. "గ్రాట్యుటీ అనేది ఉద్యోగి ఒక సంస్థకు చాలా కాలం చేసిన సేవను గుర్తించే చట్టబద్ధమైన ఆర్థిక ప్రయోజనం. దీని కోసం మొత్తం ఖర్చును యజమానే భరిస్తారు. ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి కోత ఉండదు. అందుకే రిటైర్మెంట్ సమయంలో లేదా ఉద్యోగం మారే సమయంలో ఇది మంచి ఆర్థిక సహాయంగా ఉంటుంది" అని ఆయన తెలిపారు.భారతదేశంలో ఉద్యోగులకు అందే ముఖ్యమైన చట్టబద్ధమైన రిటైర్మెంట్ ప్రయోజనాల్లో గ్రాట్యుటీ ఒకటి. ఇది ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడమే కాకుండా, ఒకే సంస్థలో దీర్ఘకాలం పనిచేసినందుకు గుర్తింపుగా కూడా ఉంటుంది. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972 ప్రకారం, అర్హత ఉన్న ఉద్యోగికి రిటైర్మెంట్, రాజీనామా, ఉద్యోగం ముగిసినప్పుడు లేదా మరణం, శాశ్వత వైకల్యం జరిగినప్పుడు యజమాని ఒకేసారి లంప్‌సమ్ రూపంలో గ్రాట్యుటీ చెల్లించాలి.గ్రాట్యుటీకి ఎవరు అర్హులు?పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972 ప్రకారం, 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ఫ్యాక్టరీలు, గనులు, ఆయిల్‌ఫీల్డ్స్, ప్లాంటేషన్స్, పోర్టులు, రైల్వేలు, షాపులు, ఇతర సంస్థలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఒకసారి ఈ చట్టం ఏదైనా సంస్థకు వర్తిస్తే, తర్వాత ఉద్యోగుల సంఖ్య 10 కంటే తక్కువకు తగ్గినా కూడా ఆ చట్టం అమల్లోనే ఉంటుంది. అదే యజమాని వద్ద వరుసగా ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హుడు అవుతాడు. అయితే ఉద్యోగి మరణించినా లేదా శాశ్వత వైకల్యం వచ్చినా ఐదేళ్ల సేవ నిబంధన వర్తించదు. అలాంటి సందర్భాల్లో ఉద్యోగి లేదా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా చట్టం అవకాశం కల్పించింది. అలాగే ఆమోదించిన సెలవులు, లేఆఫ్స్, ఉద్యోగి నియంత్రణలో లేని సమ్మెలు, లాక్‌అవుట్లు కూడా నిరంతర సేవలో భాగంగానే పరిగణిస్తారు.గ్రాట్యుటీ ఎలా లెక్కిస్తారు?చట్టం ప్రకారం గ్రాట్యుటీని ఓ ఫార్ములాతో లెక్కిస్తారు. గ్రాట్యుటీ = (15 × చివరిగా తీసుకున్న జీతం × ఉద్యోగం చేసిన సంవత్సరాలు) ÷ 26. ఇక్కడ చివరిగా తీసుకున్న జీతంలో బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఇతర అలవెన్సులు లేదా గ్రాస్ సాలరీలోని మిగతా భాగాలు లెక్కలోకి రావు. "చాలా మంది ఉద్యోగులు గ్రాట్యుటీని మొత్తం గ్రాస్ సాలరీపై లెక్కిస్తారని అనుకుంటారు. అది పెద్ద అపోహ. చట్టం ప్రకారం గ్రాట్యుటీ లెక్కించే సమయంలో చివరిగా తీసుకున్న బేసిక్ శాలరీ, డియర్‌నెస్ అలవెన్స్ మాత్రమే పరిగణిస్తారు. అలాగే కొన్ని పరిమిత సందర్భాల్లో మాత్రమే గ్రాట్యుటీని నిలిపివేయవచ్చు. ఉదాహరణకు యజమాని ఆస్తికి ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించడం, హింసాత్మక ప్రవర్తన కారణంగా ఉద్యోగం నుంచి తొలగించడం లేదా ఉద్యోగంలో ఉన్న సమయంలో నైతికంగా తీవ్రమైన నేరం చేయడం వంటి సందర్భాలు. అలాంటి పరిస్థితుల్లో కూడా యజమాని చట్టపరమైన ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలి" అని ఆయన వివరించారు. కేవలం రాజీనామా చేయడం లేదా చిన్నపాటి క్రమశిక్షణా ఉల్లంఘనల కారణంగా యజమాని గ్రాట్యుటీని నిలిపివేయడానికి హక్కు ఉండదు.యజమాని చట్టపరమైన బాధ్యత ఏమిటి?ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హత సాధించిన తర్వాత, ఉద్యోగి ప్రత్యేకంగా దరఖాస్తు చేయకపోయినా యజమాని గ్రాట్యుటీ చెల్లించడం చట్టబద్ధమైన బాధ్యత. చట్టం ప్రకారం గ్రాట్యుటీని 30 రోజుల్లోపు చెల్లించాలి. ఆలస్యమైతే వడ్డీ కూడా చెల్లించాల్సి రావచ్చు. అందుకే సమయానికి చెల్లించడం యజమాని బాధ్యత. గ్రాట్యుటీ ప్రస్తుతం అత్యంత పన్ను ప్రయోజనం ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో ఒకటి. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని వర్తించే నిబంధనలకు లోబడి రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీకి పన్ను మినహాయింపు ఉంది. రిటైర్మెంట్ ప్లానింగ్‌పై అవగాహన పెరుగుతున్న ఈ సమయంలో, ఉద్యోగుల హక్కుల గురించి తెలుసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో గ్రాట్యుటీ ఉద్యోగి విశ్వాసానికి గుర్తింపుగా ఉండటమే కాకుండా, రిటైర్మెంట్ సమయంలో లేదా ఉద్యోగ జీవితంలో కీలక మార్పుల సమయంలో ఆర్థికంగా అండగా నిలిచే ముఖ్యమైన భద్రతా ప్రయోజనంగా కొనసాగుతోంది. Expert Advice by: CA Akhil Kancherla, Akhil Kancherla & Associates, 8143232113, akandassociates2025@gmail.comLocation :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link