ప్రభన్యూస్

IASV Triveni: భారత మహిళా దళ సాహసానికి ప్రపంచం సెల్యూట్.. ఇది కదా మన దేశమంటే.. |


ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్, 314 రోజుల పాటు దాదాపు 25,500 నాటికల్ మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసి, నాలుగు మహాసముద్రాలను దాటడం అసాధారణ విజయమని ప్రశంసించారు. ఈ యాత్ర దేశంలోని ప్రతి యువతికి స్ఫూర్తిగా నిలుస్తుందని, “నారీ శక్తి” సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు.

మహిళా అధికారులు తమ అనుభవాలను పంచుకుంటూ, ఈ యాత్ర శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లు విసిరినప్పటికీ దేశం కోసం పనిచేస్తున్నామనే సంకల్పమే తమకు ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. దేశ గౌరవాన్ని నిలబెట్టాలనే నిబద్ధత వల్లే కఠిన పరిస్థితులను అధిగమించగలిగామని వివరించారు. వారి మాటలు తనకూ స్ఫూర్తినిచ్చాయని, దృఢ సంకల్పంతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఈ బృందం నిరూపించిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మహిళల సామర్థ్యంపై ఉన్న పాత అపోహలను ఈ యాత్ర పూర్తిగా చెరిపేసిందని ఆయన అన్నారు. శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, నాయకత్వ లక్షణాలు లింగంతో సంబంధం లేవని ఈ మహిళా అధికారులు నిరూపించారని కొనియాడారు. భారతదేశంలోని ప్రతి అమ్మాయి వీరిని చూసి సముద్రాలను దాటి ప్రపంచాన్ని జయించగలననే ఆత్మవిశ్వాసం పొందుతుందని వ్యాఖ్యానించారు.

‘సముద్ర ప్రదక్షిణ’ను మూడు సాయుధ దళాల ఐక్యతకు ప్రతీకగా అభివర్ణించిన రాజ్‌నాథ్ సింగ్, భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళానికి చెందిన అధికారులు ఒకే నౌకలో, ఒకే జెండా కింద ఒకే లక్ష్యంతో కలిసి పనిచేయడం గొప్ప విజయమన్నారు. కలిసి ముందుకు సాగితే ఏ లక్ష్యమూ అసాధ్యం కాదనే సందేశాన్ని ఈ యాత్ర ప్రపంచానికి అందించిందని చెప్పారు.

ఈ యాత్ర సందర్భంగా సందర్శించిన పలు దేశాల్లో భారత ఇంజినీరింగ్ ప్రతిభ, స్వదేశీ సాంకేతిక సామర్థ్యం, ఆధునిక రక్షణ నైపుణ్యాలను ప్రపంచానికి పరిచయం చేసినందుకు కూడా ఆయన బృందాన్ని అభినందించారు. భారత్ ఏ రంగంలోనూ వెనుకబడలేదనే సందేశాన్ని వారు ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు.

ఈ సమావేశానికి ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్తో పాటు మూడు దళాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.

జూలై 22, 2026న ముంబైలో ఈ బృందానికి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా స్వాగతం పలికారు. కాగా, ఈ యాత్ర ప్రారంభోత్సవాన్ని సెప్టెంబర్ 11, 2025న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనే ప్రారంభించారు.

ఈ చారిత్రక యాత్ర విజయవంతం కావడానికి దాదాపు రెండేళ్లపాటు కఠిన శిక్షణ, సమగ్ర ప్రణాళిక, 24 గంటల తీరప్రాంత సహాయక వ్యవస్థ, అనేక సంస్థల సమన్వయం కీలక పాత్ర పోషించాయి. ప్రపంచ ప్రదక్షిణకు అవసరమైన అన్ని అంతర్జాతీయ ప్రమాణాలను ఈ యాత్ర పూర్తి చేసింది. అన్ని రేఖాంశాలను దాటడంతో పాటు, భూమధ్యరేఖను రెండుసార్లు, అంతర్జాతీయ తేదీ రేఖ (International Date Line)ను దాటి, కేప్ లీవిన్, కేప్ హార్న్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే మూడు ప్రసిద్ధ కేప్‌లను చుట్టివచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన సముద్ర మార్గాల్లో ఒకటైన డ్రేక్ ప్యాసేజ్ను విజయవంతంగా దాటి, కేప్ హార్న్ను చుట్టివచ్చినందుకు ఈ బృందానికి ప్రతిష్ఠాత్మకమైన ‘కేప్ హార్నర్స్’ సభ్యత్వం కూడా లభించింది. సముద్రయాన విజయంతో పాటు, ఈ యాత్ర సైనిక దౌత్యానికి కూడా బలమైన వేదికగా నిలిచింది. వివిధ దేశాల నౌకాశ్రయాల్లో భారత సంస్కృతి, సముద్ర సంప్రదాయాలు, సైనిక క్రమశిక్షణ, విలువలను ప్రపంచానికి పరిచయం చేస్తూ స్నేహపూర్వక దేశాలతో బంధాలను మరింత బలోపేతం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 July 2026, 9:34 pm Digital Edition : Prabhanews
IASV Triveni: భారత మహిళా దళ సాహసానికి ప్రపంచం సెల్యూట్.. ఇది కదా మన దేశమంటే.. |

ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్, 314 రోజుల పాటు దాదాపు 25,500 నాటికల్ మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసి, నాలుగు మహాసముద్రాలను దాటడం అసాధారణ విజయమని ప్రశంసించారు. ఈ యాత్ర దేశంలోని ప్రతి యువతికి స్ఫూర్తిగా నిలుస్తుందని, "నారీ శక్తి" సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు.
Felicitated the nine women officers of the three Services, who returned home after successfully completing the first-ever Tri-service all-women circumnavigation sailing expedition ‘Samudra Pradakshina’ onboard the Indian Army Sailing Vessel (IASV) Triveni.Applauded their… pic.twitter.com/YUiLUgiyCi
— Rajnath Singh (@rajnathsingh) July 30, 2026మహిళా అధికారులు తమ అనుభవాలను పంచుకుంటూ, ఈ యాత్ర శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లు విసిరినప్పటికీ దేశం కోసం పనిచేస్తున్నామనే సంకల్పమే తమకు ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. దేశ గౌరవాన్ని నిలబెట్టాలనే నిబద్ధత వల్లే కఠిన పరిస్థితులను అధిగమించగలిగామని వివరించారు. వారి మాటలు తనకూ స్ఫూర్తినిచ్చాయని, దృఢ సంకల్పంతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఈ బృందం నిరూపించిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా మహిళల సామర్థ్యంపై ఉన్న పాత అపోహలను ఈ యాత్ర పూర్తిగా చెరిపేసిందని ఆయన అన్నారు. శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, నాయకత్వ లక్షణాలు లింగంతో సంబంధం లేవని ఈ మహిళా అధికారులు నిరూపించారని కొనియాడారు. భారతదేశంలోని ప్రతి అమ్మాయి వీరిని చూసి సముద్రాలను దాటి ప్రపంచాన్ని జయించగలననే ఆత్మవిశ్వాసం పొందుతుందని వ్యాఖ్యానించారు.‘సముద్ర ప్రదక్షిణ’ను మూడు సాయుధ దళాల ఐక్యతకు ప్రతీకగా అభివర్ణించిన రాజ్‌నాథ్ సింగ్, భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళానికి చెందిన అధికారులు ఒకే నౌకలో, ఒకే జెండా కింద ఒకే లక్ష్యంతో కలిసి పనిచేయడం గొప్ప విజయమన్నారు. కలిసి ముందుకు సాగితే ఏ లక్ష్యమూ అసాధ్యం కాదనే సందేశాన్ని ఈ యాత్ర ప్రపంచానికి అందించిందని చెప్పారు.ఈ యాత్ర సందర్భంగా సందర్శించిన పలు దేశాల్లో భారత ఇంజినీరింగ్ ప్రతిభ, స్వదేశీ సాంకేతిక సామర్థ్యం, ఆధునిక రక్షణ నైపుణ్యాలను ప్రపంచానికి పరిచయం చేసినందుకు కూడా ఆయన బృందాన్ని అభినందించారు. భారత్ ఏ రంగంలోనూ వెనుకబడలేదనే సందేశాన్ని వారు ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు.ఈ సమావేశానికి ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్తో పాటు మూడు దళాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.జూలై 22, 2026న ముంబైలో ఈ బృందానికి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా స్వాగతం పలికారు. కాగా, ఈ యాత్ర ప్రారంభోత్సవాన్ని సెప్టెంబర్ 11, 2025న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనే ప్రారంభించారు.ఈ చారిత్రక యాత్ర విజయవంతం కావడానికి దాదాపు రెండేళ్లపాటు కఠిన శిక్షణ, సమగ్ర ప్రణాళిక, 24 గంటల తీరప్రాంత సహాయక వ్యవస్థ, అనేక సంస్థల సమన్వయం కీలక పాత్ర పోషించాయి. ప్రపంచ ప్రదక్షిణకు అవసరమైన అన్ని అంతర్జాతీయ ప్రమాణాలను ఈ యాత్ర పూర్తి చేసింది. అన్ని రేఖాంశాలను దాటడంతో పాటు, భూమధ్యరేఖను రెండుసార్లు, అంతర్జాతీయ తేదీ రేఖ (International Date Line)ను దాటి, కేప్ లీవిన్, కేప్ హార్న్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే మూడు ప్రసిద్ధ కేప్‌లను చుట్టివచ్చింది.ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన సముద్ర మార్గాల్లో ఒకటైన డ్రేక్ ప్యాసేజ్ను విజయవంతంగా దాటి, కేప్ హార్న్ను చుట్టివచ్చినందుకు ఈ బృందానికి ప్రతిష్ఠాత్మకమైన ‘కేప్ హార్నర్స్’ సభ్యత్వం కూడా లభించింది. సముద్రయాన విజయంతో పాటు, ఈ యాత్ర సైనిక దౌత్యానికి కూడా బలమైన వేదికగా నిలిచింది. వివిధ దేశాల నౌకాశ్రయాల్లో భారత సంస్కృతి, సముద్ర సంప్రదాయాలు, సైనిక క్రమశిక్షణ, విలువలను ప్రపంచానికి పరిచయం చేస్తూ స్నేహపూర్వక దేశాలతో బంధాలను మరింత బలోపేతం చేసింది.

Source link