ప్రభన్యూస్

Farmer Protest: మిడ్ మానేరు నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు.. పోత్తూరు బ్రిడ్జిపై ఉద్రిక్త పరిస్థితులు..! Telangana farmer protest. |


Last Updated:

ఎల్‌నినోతో రాజన్న సిరిసిల్లలో వరి పంటలు ఎండిపోతున్నాయి. మిడ్ మానేరు నుండి నీటి విడుదల కోరుతూ రైతులు ధర్నా చేశారు.

+

News18

News18

ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి పంటలు ఎండిపోతుండటంతో పాటు నారు మడులు కూడా నీరు లేక వాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పోత్తూరు బ్రిడ్జిపై రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

మిడ్ మానేరు జలాశయంలోకి నీటిని ఎత్తిపోసే కాలేశ్వరం పంప్‌హౌస్‌లు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటి విడుదలలో జాప్యం చేస్తోందని రైతులు ఆరోపించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయని, పరిస్థితి మరింత విషమించేలోపు వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సాగునీరు అందకపోతే ఈ సీజన్‌లో భారీ నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.

గోదావరి జలాలు అందుబాటులో ఉండే ప్రాంతమైన ఇల్లంతకుంట మండలంలోనే ఈ స్థాయిలో కరువు పరిస్థితులు నెలకొనడం బాధాకరమని రైతులు పేర్కొన్నారు. మానేరు నది ఒడ్డున ఉన్న గ్రామాల్లో కూడా మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నారు మడులను కాపాడుకోవడానికి రైతులు బిందెలతో నీళ్లు మోసి పోస్తున్న పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఆందోళనలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రైతులు, విద్యార్థులు, మహిళలు విశ్వసించి అధికారంలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత పదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ప్రస్తుత పాలన వెనక్కి నెడుతోందని విమర్శించారు. రైతుల కష్టాలను వెంటనే గుర్తించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించి మిడ్ మానేరు జలాశయంలోకి నీటిని విడుదల చేయాలని రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఇల్లంతకుంట మండలం నుంచి భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులందరినీ ఏకం చేసి రోడ్ల దిగ్బంధనం, కలెక్టరేట్ ముట్టడి, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 6:30 pm Digital Edition : Prabhanews
Farmer Protest: మిడ్ మానేరు నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు.. పోత్తూరు బ్రిడ్జిపై ఉద్రిక్త పరిస్థితులు..! Telangana farmer protest. |

Last Updated:Jul 16, 2026 5:40 PM ISTఎల్‌నినోతో రాజన్న సిరిసిల్లలో వరి పంటలు ఎండిపోతున్నాయి. మిడ్ మానేరు నుండి నీటి విడుదల కోరుతూ రైతులు ధర్నా చేశారు.+
News18ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి పంటలు ఎండిపోతుండటంతో పాటు నారు మడులు కూడా నీరు లేక వాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పోత్తూరు బ్రిడ్జిపై రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.మిడ్ మానేరు జలాశయంలోకి నీటిని ఎత్తిపోసే కాలేశ్వరం పంప్‌హౌస్‌లు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటి విడుదలలో జాప్యం చేస్తోందని రైతులు ఆరోపించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయని, పరిస్థితి మరింత విషమించేలోపు వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సాగునీరు అందకపోతే ఈ సీజన్‌లో భారీ నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.గోదావరి జలాలు అందుబాటులో ఉండే ప్రాంతమైన ఇల్లంతకుంట మండలంలోనే ఈ స్థాయిలో కరువు పరిస్థితులు నెలకొనడం బాధాకరమని రైతులు పేర్కొన్నారు. మానేరు నది ఒడ్డున ఉన్న గ్రామాల్లో కూడా మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నారు మడులను కాపాడుకోవడానికి రైతులు బిందెలతో నీళ్లు మోసి పోస్తున్న పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఆందోళనలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రైతులు, విద్యార్థులు, మహిళలు విశ్వసించి అధికారంలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత పదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ప్రస్తుత పాలన వెనక్కి నెడుతోందని విమర్శించారు. రైతుల కష్టాలను వెంటనే గుర్తించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించి మిడ్ మానేరు జలాశయంలోకి నీటిని విడుదల చేయాలని రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఇల్లంతకుంట మండలం నుంచి భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులందరినీ ఏకం చేసి రోడ్ల దిగ్బంధనం, కలెక్టరేట్ ముట్టడి, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.Location :Karimnagar,Karimnagar,Telanganaమరింత చదవండి

Source link