Last Updated:
వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి, విత్తనాలతో రూపొందించిన ‘సీడ్ గణేశా’ ప్రతిమలను పూజించాలని సూచించారు.
వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి, విత్తనాలతో రూపొందించిన ‘సీడ్ గణేశా’ ప్రతిమలను పూజించాలని సూచించారు. సీడ్ గణేశుడిని పూజించి, అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే.. ఆ విగ్రహంలోని విత్తనం మొలకెత్తి మొక్కగా మారుతుందని, తద్వారా వినాయకుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన ఇంట్లోనే ఉంటాయని చిరంజీవి అన్నారు.
