ఈ రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు కీలక రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు మార్గమధ్యలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత అక్కడి నుంచి తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు మీదుగా ప్రయాణించి రేణిగుంట జంక్షన్ స్టేషన్లో కూడా ఆగుతాయి. ఈ ప్రధాన స్టేషన్ల పరిధిలోని ప్రయాణికులు కూడా ఈ అదనపు సర్వీసులను వినియోగించుకుని తిరుమల యాత్రను సులభతరం చేసుకోవచ్చు.
