Last Updated:
Fact Check: దేశంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భారత పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 5,000 నగదును ఉచితంగా అందజేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విస్తృతంగా ప్రచారమవుతోంది.
వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార విభాగమైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB Fact Check) తీవ్రంగా స్పందించింది. ఆ ప్రకటన పూర్తిగా నకిలీదని (FAKE), ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు సృష్టించిన స్కామ్ అని స్పష్టం చేసింది.

