దీని కోసం ఈపీఎఫ్ఓ, సెబీ వద్ద రిజిస్టర్ అయిన పోర్ట్ఫోలియో మేనేజర్లను డిస్క్రెషనరీ పీఎంఎస్ విధానంలో నియమిస్తుంది. అయితే మొత్తం పర్యవేక్షణ మాత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT), ఇన్వెస్ట్మెంట్ కమిటీల చేతుల్లోనే ఉంటుంది. ఈ మేనేజర్లు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన పెట్టుబడి మార్గదర్శకాల ప్రకారమే పనిచేయాలి. ఈపీఎఫ్ఓ పెట్టుబడుల పంపిణీ ప్రధానంగా ప్రభుత్వ సెక్యూరిటీస్ (G-Secs), స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ (SDLs)లో 45 నుంచి 65 శాతం, కార్పొరేట్ బాండ్లు, ఇతర డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో 35 నుంచి 45 శాతం, ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత పెట్టుబడుల్లో గరిష్ఠంగా 15 శాతం ఉంటాయి. ఇందులో కూడా కొత్తగా వచ్చే నిధులను ఎక్కువగా ఇండెక్స్ ఈటీఎఫ్ల (ETFs) ద్వారా పెట్టుబడి పెడతారు. పెట్టుబడి నిర్వహణను బయట నిపుణులకు అప్పగించడం వల్ల, అంత పెద్ద అంతర్గత పెట్టుబడి బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా సంస్థాగత నైపుణ్యాన్ని ఉపయోగించుకోవచ్చని బాగుల్ చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

