ప్రభన్యూస్

పేపర్ లీకేజీలపై కేంద్రం ఉక్కుపాదం.. లీక్ చేస్తే రూ.కోటి జరిమానా, పదేళ్ల జైలు శిక్ష! |


Last Updated:

ప్రశ్నాపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, పదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాలతో కూడిన కఠిన చట్టానికి నేడు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వచ్చే వారం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

News18
News18

నీట్ తదితర పోటీ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. లీకేజీ ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం-2024కు భారీ సవరణలు తీసుకురానుంది. ఈ ముసాయిదా బిల్లుపై శుక్రవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. గురువారం అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని, దోషులకు కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టం తెస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

పేపర్ లీక్ కేసులను ఏడాదిలోపు పరిష్కరించేలా గడువు విధించడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు లాంటి కీలక అంశాలు ఈ బిల్లులో ఉండనున్నాయి. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడితే మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, పది లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నారు. సంస్థాగతంగా ఈ నేరాలకు పాల్పడే ముఠాలకు ఐదేళ్ల నుంచి పదేళ్ల జైలు శిక్షతో పాటు కనీసం కోటి రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఇప్పుడు వీటిని మరింత కఠినతరం చేస్తూ, అంతర్రాష్ట్ర స్థాయిలో ఆపరేట్ చేసే లీకేజీ మాఫియాను పూర్తిగా అంతం చేసేలా కొత్త సవరణలు సిద్ధం చేశారు. నిందితులు సులువుగా బయటపడకుండా చట్టాన్ని బలోపేతం చేస్తున్నారు.

కోటి జరిమానా, పదేళ్ల జైలు శిక్ష!

న్యూస్ హిందీ కథనం ప్రకారం.. కొత్త కఠిన చట్టంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రమైన శిక్షలను పొందుపరిచింది. ఈ చట్టం ప్రకారం పేపర్ లీకేజీకి పాల్పడిన వ్యక్తులకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. దీంతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

అలాగే వ్యవస్థాగతంగా, ముఠాలుగా ఏర్పడి పేపర్ లీకేజీ రాకెట్లు నడిపే వారిపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇలాంటి లీకేజీ మాఫియాకు ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు కనీసం రూ.1 కోటి భారీ జరిమానా విధించనున్నారు.

విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేసిన 26 రోజుల నిరాహార దీక్ష విరమణ జరిగిన మరుసటి రోజే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గురుగ్రామ్‌లోని మెదాంత ఆస్పత్రిలో వాంగ్చుక్‌ను కలిసిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆయనకు పలు హామీలు ఇచ్చారు. పార్లమెంటులో పేపర్ లీకేజీల సమస్యతో పాటు పరీక్షా సంస్కరణలపై సమగ్రంగా చర్చిస్తామని వారు ఆయనకు భరోసా ఇచ్చారు.

నీట్ పేపర్ లీక్ వివాదం కారణంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇచ్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని కూడా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో, విద్యావ్యవస్థపై విద్యార్థుల్లో తిరిగి నమ్మకం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కొత్త చట్టం ద్వారా ఈ వేగవంతమైన చర్యలు చేపట్టింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 12:14 pm Digital Edition : Prabhanews
పేపర్ లీకేజీలపై కేంద్రం ఉక్కుపాదం.. లీక్ చేస్తే రూ.కోటి జరిమానా, పదేళ్ల జైలు శిక్ష! |

Last Updated:Jul 24, 2026 12:08 PM ISTప్రశ్నాపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, పదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాలతో కూడిన కఠిన చట్టానికి నేడు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వచ్చే వారం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.News18నీట్ తదితర పోటీ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. లీకేజీ ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం-2024కు భారీ సవరణలు తీసుకురానుంది. ఈ ముసాయిదా బిల్లుపై శుక్రవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. గురువారం అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని, దోషులకు కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టం తెస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.పేపర్ లీక్ కేసులను ఏడాదిలోపు పరిష్కరించేలా గడువు విధించడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు లాంటి కీలక అంశాలు ఈ బిల్లులో ఉండనున్నాయి. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది.ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడితే మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, పది లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నారు. సంస్థాగతంగా ఈ నేరాలకు పాల్పడే ముఠాలకు ఐదేళ్ల నుంచి పదేళ్ల జైలు శిక్షతో పాటు కనీసం కోటి రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఇప్పుడు వీటిని మరింత కఠినతరం చేస్తూ, అంతర్రాష్ట్ర స్థాయిలో ఆపరేట్ చేసే లీకేజీ మాఫియాను పూర్తిగా అంతం చేసేలా కొత్త సవరణలు సిద్ధం చేశారు. నిందితులు సులువుగా బయటపడకుండా చట్టాన్ని బలోపేతం చేస్తున్నారు.కోటి జరిమానా, పదేళ్ల జైలు శిక్ష!న్యూస్ హిందీ కథనం ప్రకారం.. కొత్త కఠిన చట్టంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రమైన శిక్షలను పొందుపరిచింది. ఈ చట్టం ప్రకారం పేపర్ లీకేజీకి పాల్పడిన వ్యక్తులకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. దీంతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు.అలాగే వ్యవస్థాగతంగా, ముఠాలుగా ఏర్పడి పేపర్ లీకేజీ రాకెట్లు నడిపే వారిపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇలాంటి లీకేజీ మాఫియాకు ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు కనీసం రూ.1 కోటి భారీ జరిమానా విధించనున్నారు.విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేసిన 26 రోజుల నిరాహార దీక్ష విరమణ జరిగిన మరుసటి రోజే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గురుగ్రామ్‌లోని మెదాంత ఆస్పత్రిలో వాంగ్చుక్‌ను కలిసిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆయనకు పలు హామీలు ఇచ్చారు. పార్లమెంటులో పేపర్ లీకేజీల సమస్యతో పాటు పరీక్షా సంస్కరణలపై సమగ్రంగా చర్చిస్తామని వారు ఆయనకు భరోసా ఇచ్చారు.నీట్ పేపర్ లీక్ వివాదం కారణంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇచ్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని కూడా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో, విద్యావ్యవస్థపై విద్యార్థుల్లో తిరిగి నమ్మకం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కొత్త చట్టం ద్వారా ఈ వేగవంతమైన చర్యలు చేపట్టింది.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,TelanganaFirst Published :Jul 24, 2026 12:01 PM ISTమరింత చదవండి

Source link