ప్రభన్యూస్

అధికారుల ఒక్క నిర్ణయం.. అమాంతం రెట్టింపైన వేములవాడ రాజన్న ఆదాయం! | తెలంగాణ వార్తలు


Last Updated:

వేములవాడ ఆలయంలో కాసుల వర్షం. చరిత్ర సృష్టించిన భీమేశ్వరస్వామి ఆలయం.. ఒక్కరోజులోనే ఇన్ని టికెట్లు ఎప్పుడైనా అమ్ముడయ్యాయా?

News18
News18

ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నిత్యం భక్తుల రద్దీతో ఎంతో కోలాహలంగా ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి తరలివస్తుంటారు. ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో స్వామివారికి నిర్వహించే అభిషేకానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గతంలో రాజన్న ఆలయ ప్రాంగణంలోనే ఈ పూజలు జరిగేవి. అప్పుడు ప్రతి సోమవారం సగటున వంద వరకు అభిషేకాలు మాత్రమే జరిగేవి. అయితే భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం, స్థలాభావం కారణాలతో ఈ పూజలను సమీపంలో ఉన్న భీమేశ్వరస్వామి ఆలయంలోకి మార్చారు. ఈ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత అభిషేకాలు చేసుకునే భక్తుల సంఖ్య అమాంతం రెట్టింపు కావడం విశేషం.

భీమేశ్వరస్వామి ఆలయంలో అత్యంత విశాలమైన ప్రాంగణం అందుబాటులో ఉండటంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో పూజలు చేసుకునే వెసులుబాటు కలిగింది. స్వామివారికి స్వయంగా పాలు, పెరుగు, తేనె, పూలతో అభిషేకం చేసుకునేందుకు దేవస్థానం అధికారులు ఒక టికెట్ ధరను వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. ఈ వేయి రూపాయల టికెట్‌ కొనుగోలు చేసిన ఒక జంటను మాత్రమే పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. పరమశివుడికి సోమవారం ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఆరోజున భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఒక్కోసారి అభిషేక మండపం వద్ద క్యూలైన్లు తీవ్ర రద్దీగా మారుతున్నాయి. దైవదర్శనంతో పాటు అభిషేకం కోసం భక్తులు ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నారు.

ఇది కూడా చదవండి: భక్తులకు కళ్లుచెదిరే శుభవార్త.. ఇకపై ఆ గుడికి వెళ్లాలంటే జేబులోంచి రూ.1 తీయాల్సిన పనిలేదు!

అభిషేకాలను భీమేశ్వరస్వామి ఆలయానికి మార్చిన తర్వాత దేవస్థానం ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. వేసవి సెలవుల కారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తుల తాకిడి సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో నమోదైంది. ఈ మూడు నెలల కాలంలోనే ఏకంగా 4,600 అభిషేకం పూజా టికెట్లు విక్రయించినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. తద్వారా దేవస్థానానికి 46 లక్షల రూపాయల భారీ ఆదాయం సమకూరింది. పూజా కార్యక్రమాలను క్రమబద్ధీకరించడం, మెరుగైన వసతులు కల్పించడం వల్లే ఇంతటి భారీ స్పందన వస్తోందని స్పష్టమవుతోంది. భక్తులు కూడా ఎంతో సంతృప్తిగా, భక్తిశ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rain Alert: ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు.. ఆ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు!

ఈ నెల 13న వచ్చిన సోమవారం రోజున ఆలయ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. ఆ రోజున శివుడికి అత్యంత ఇష్టమైన ఆరుద్ర నక్షత్రం రావడం కలసివచ్చింది. ఈ పవిత్రమైన రోజున స్వామివారికి అభిషేకం చేసేందుకు భక్తులు ఊహించని స్థాయిలో తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా సాగిన ఈ పూజల్లో రికార్డు స్థాయిలో 266 టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం ఒకే రోజులో ఇంత భారీ స్థాయిలో అభిషేకాలు జరగడం గతంలో ఎన్నడూ చూడలేదని ఆలయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశారు.

భక్తుల నుంచి వస్తున్న విశేష స్పందన చూస్తుంటే రానున్న రోజుల్లో స్వామివారి అభిషేకం పూజల ద్వారా ఆలయ ఆదాయం మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలో రాబోయే శ్రావణమాసం, కార్తీకమాసం లాంటి పవిత్ర మాసాల్లో ఈ రద్దీ మూడింతలు అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు సైతం భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వసతులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. క్యూలైన్ల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భీమేశ్వరస్వామి ఆలయం ఇప్పుడు శివనామస్మరణతో నిత్యం కళకళలాడుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 11:30 am Digital Edition : Prabhanews
అధికారుల ఒక్క నిర్ణయం.. అమాంతం రెట్టింపైన వేములవాడ రాజన్న ఆదాయం! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 16, 2026 11:30 AM ISTవేములవాడ ఆలయంలో కాసుల వర్షం. చరిత్ర సృష్టించిన భీమేశ్వరస్వామి ఆలయం.. ఒక్కరోజులోనే ఇన్ని టికెట్లు ఎప్పుడైనా అమ్ముడయ్యాయా?News18ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నిత్యం భక్తుల రద్దీతో ఎంతో కోలాహలంగా ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి తరలివస్తుంటారు. ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో స్వామివారికి నిర్వహించే అభిషేకానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గతంలో రాజన్న ఆలయ ప్రాంగణంలోనే ఈ పూజలు జరిగేవి. అప్పుడు ప్రతి సోమవారం సగటున వంద వరకు అభిషేకాలు మాత్రమే జరిగేవి. అయితే భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం, స్థలాభావం కారణాలతో ఈ పూజలను సమీపంలో ఉన్న భీమేశ్వరస్వామి ఆలయంలోకి మార్చారు. ఈ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత అభిషేకాలు చేసుకునే భక్తుల సంఖ్య అమాంతం రెట్టింపు కావడం విశేషం.భీమేశ్వరస్వామి ఆలయంలో అత్యంత విశాలమైన ప్రాంగణం అందుబాటులో ఉండటంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో పూజలు చేసుకునే వెసులుబాటు కలిగింది. స్వామివారికి స్వయంగా పాలు, పెరుగు, తేనె, పూలతో అభిషేకం చేసుకునేందుకు దేవస్థానం అధికారులు ఒక టికెట్ ధరను వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. ఈ వేయి రూపాయల టికెట్‌ కొనుగోలు చేసిన ఒక జంటను మాత్రమే పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. పరమశివుడికి సోమవారం ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఆరోజున భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఒక్కోసారి అభిషేక మండపం వద్ద క్యూలైన్లు తీవ్ర రద్దీగా మారుతున్నాయి. దైవదర్శనంతో పాటు అభిషేకం కోసం భక్తులు ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నారు.ఇది కూడా చదవండి: భక్తులకు కళ్లుచెదిరే శుభవార్త.. ఇకపై ఆ గుడికి వెళ్లాలంటే జేబులోంచి రూ.1 తీయాల్సిన పనిలేదు!అభిషేకాలను భీమేశ్వరస్వామి ఆలయానికి మార్చిన తర్వాత దేవస్థానం ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. వేసవి సెలవుల కారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తుల తాకిడి సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో నమోదైంది. ఈ మూడు నెలల కాలంలోనే ఏకంగా 4,600 అభిషేకం పూజా టికెట్లు విక్రయించినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. తద్వారా దేవస్థానానికి 46 లక్షల రూపాయల భారీ ఆదాయం సమకూరింది. పూజా కార్యక్రమాలను క్రమబద్ధీకరించడం, మెరుగైన వసతులు కల్పించడం వల్లే ఇంతటి భారీ స్పందన వస్తోందని స్పష్టమవుతోంది. భక్తులు కూడా ఎంతో సంతృప్తిగా, భక్తిశ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు.ఇది కూడా చదవండి: Rain Alert: ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు.. ఆ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు!ఈ నెల 13న వచ్చిన సోమవారం రోజున ఆలయ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. ఆ రోజున శివుడికి అత్యంత ఇష్టమైన ఆరుద్ర నక్షత్రం రావడం కలసివచ్చింది. ఈ పవిత్రమైన రోజున స్వామివారికి అభిషేకం చేసేందుకు భక్తులు ఊహించని స్థాయిలో తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా సాగిన ఈ పూజల్లో రికార్డు స్థాయిలో 266 టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం ఒకే రోజులో ఇంత భారీ స్థాయిలో అభిషేకాలు జరగడం గతంలో ఎన్నడూ చూడలేదని ఆలయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశారు.భక్తుల నుంచి వస్తున్న విశేష స్పందన చూస్తుంటే రానున్న రోజుల్లో స్వామివారి అభిషేకం పూజల ద్వారా ఆలయ ఆదాయం మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలో రాబోయే శ్రావణమాసం, కార్తీకమాసం లాంటి పవిత్ర మాసాల్లో ఈ రద్దీ మూడింతలు అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు సైతం భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వసతులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. క్యూలైన్ల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భీమేశ్వరస్వామి ఆలయం ఇప్పుడు శివనామస్మరణతో నిత్యం కళకళలాడుతోంది.Location :Sircilla,Karimnagar,TelanganaFirst Published :Jul 16, 2026 11:30 AM ISTమరింత చదవండి

Source link