తమిళ మీడియా వర్గాల సమాచారం మేరకు.. జన నాయగన్ సినిమాలోని ఇతర నటీనటులకు కూడా భారీగా పారితోషికం చెల్లించారు. ప్రకాష్ రాజ్కు రూ. 5 కోట్లు, ప్రియమణికి రూ. 3 కోట్లు, గౌతమ్ వాసుదేవ్ మీనన్కు రూ. 3 కోట్లు, నరైన్కు రూ. 2.5 కోట్లు అందినట్లు సమాచారం. వివిధ వర్గాల సమాచారం ప్రకారం, మమితా బైజు పారితోషికం రూ. 60 లక్షల నుంచి రూ. 2 కోట్ల మధ్య మారుతూ ఉంటుంది.

