ప్రభన్యూస్

Thalli bidda express: ఏపీలో కొత్త పథకం. “తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనాల్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Thalli bidda express: ఈ “తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్” పథకంలో సకల సౌకర్యాలతో త్వరలో అందుబాటులోకి 500 కొత్త వాహనాలు రాబోతున్నాయి. ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలకు ఇవి ప్రయోజనం కలిగిస్తాయి. పథకం పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఏపీలో కొత్త పథకం. "తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్" వాహనాల్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఏపీలో కొత్త పథకం. “తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనాల్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఏపీ రాష్ట్రంలో మాతా-శిశు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోన్న ప్రభుత్వం.. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవల్ని అందించేందుకు కొత్తగా ‘తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాలను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమం కోసం సిద్ధం చేసిన వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి-శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు, వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ నమూనాలను ముఖ్యమంత్రి లోతుగా పరిశీలించారు. ప్రజలకు ఈ సేవలపై స్పష్టమైన అవగాహన కలిగేలా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన బ్రాండింగ్ డిజైన్లకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.

అందుబాటులోకి 500 వాహనాలు:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, వారి నవజాత శిశువులు, సహాయకులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చడం ఈ వాహనాల ముఖ్య విధి. అలాగే.. అధిక ప్రమాద గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడే గర్భిణులు, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లే గర్భిణులకు ఈ వాహనాల్లో రవాణా సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రత్యేక SUV/MUV వాహనాలను వాడతారు. ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందుతారు.

“తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనం

రియల్ టైమ్ పర్యవేక్షణకు జీపీఎస్ వ్యవస్థ:

వాహనాల్లో తల్లీ-శిశువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సౌకర్యాలను కల్పించారు. వెనుక సీట్లలో సీటు బెల్టులు, బాలింతలు సులభంగా ఎక్కేందుకు ఫుట్‌రెస్ట్, ఎయిర్ కండిషనింగ్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి వాహనంలో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా రియల్ టైమ్ పర్యవేక్షణకు అవకాశం కల్పించారు.

ఇవి కూడా చదవండి: Kawah Ijen Volcano: బ్లూ లావా వెదజల్లే ఏకైక అగ్ని పర్వతం.. ఎక్కడుందో తెలుసా?

వాహనాల పరిశీలన సందర్భంగా అధికారులు కార్యక్రమం అమలు విధానం, వాహనాల నిర్వహణ, రాష్ట్రవ్యాప్తంగా సేవల విస్తరణపై ముఖ్యమంత్రికి వివరించారు. వాహనాలపై అధికారిక స్టిక్కరింగ్ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీటి సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండ్యన్, ఆ శాఖ ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) అధికారులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 9:07 am Digital Edition : Prabhanews
Thalli bidda express: ఏపీలో కొత్త పథకం. “తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనాల్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 21, 2026 5:18 AM ISTThalli bidda express: ఈ "తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్" పథకంలో సకల సౌకర్యాలతో త్వరలో అందుబాటులోకి 500 కొత్త వాహనాలు రాబోతున్నాయి. ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలకు ఇవి ప్రయోజనం కలిగిస్తాయి. పథకం పూర్తి వివరాలు తెలుసుకోండి.ఏపీలో కొత్త పథకం. "తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్" వాహనాల్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు అమరావతి: ఏపీ రాష్ట్రంలో మాతా-శిశు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోన్న ప్రభుత్వం.. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవల్ని అందించేందుకు కొత్తగా 'తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాలను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమం కోసం సిద్ధం చేసిన వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి-శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు, వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ నమూనాలను ముఖ్యమంత్రి లోతుగా పరిశీలించారు. ప్రజలకు ఈ సేవలపై స్పష్టమైన అవగాహన కలిగేలా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన బ్రాండింగ్ డిజైన్లకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.అందుబాటులోకి 500 వాహనాలు:ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, వారి నవజాత శిశువులు, సహాయకులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చడం ఈ వాహనాల ముఖ్య విధి. అలాగే.. అధిక ప్రమాద గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడే గర్భిణులు, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లే గర్భిణులకు ఈ వాహనాల్లో రవాణా సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రత్యేక SUV/MUV వాహనాలను వాడతారు. ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందుతారు. "తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్" వాహనంరియల్ టైమ్ పర్యవేక్షణకు జీపీఎస్ వ్యవస్థ:వాహనాల్లో తల్లీ-శిశువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సౌకర్యాలను కల్పించారు. వెనుక సీట్లలో సీటు బెల్టులు, బాలింతలు సులభంగా ఎక్కేందుకు ఫుట్‌రెస్ట్, ఎయిర్ కండిషనింగ్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి వాహనంలో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా రియల్ టైమ్ పర్యవేక్షణకు అవకాశం కల్పించారు.ఇవి కూడా చదవండి: Kawah Ijen Volcano: బ్లూ లావా వెదజల్లే ఏకైక అగ్ని పర్వతం.. ఎక్కడుందో తెలుసా?వాహనాల పరిశీలన సందర్భంగా అధికారులు కార్యక్రమం అమలు విధానం, వాహనాల నిర్వహణ, రాష్ట్రవ్యాప్తంగా సేవల విస్తరణపై ముఖ్యమంత్రికి వివరించారు. వాహనాలపై అధికారిక స్టిక్కరింగ్ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీటి సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండ్యన్, ఆ శాఖ ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) అధికారులు పాల్గొన్నారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link