ఈ అకౌంట్లో సాధారణంగా కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం ఉండదు. అలాగే బేసిక్ బ్యాంకింగ్ సదుపాయాలతో పాటు రూపే ఏటీఎం-కమ్-డెబిట్ కార్డు, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఇతర డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 1, 2026 నుంచి క్యాష్ విత్డ్రాయల్పై మారిన ఛార్జీలను కస్టమర్లు గమనించాలని ఎస్బీఐ సూచించింది. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు మాత్రం ఎలాంటి ఛార్జీ లేకుండా, ఎలాంటి పరిమితి లేకుండా కొనసాగుతాయని మరోసారి స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
