అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగణ్, రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి వంటి కీలక సభ్యుల అభిప్రాయాలను కూడా ఇందులో పొందుపరిచారు. దాదాపు 97 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీనూ 2024 డిసెంబర్ 20న కొన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీకి ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల స్పందన రాకపోవడంతో.. రాజమౌళి కెరీర్లో ఇది అరుదైన ఫ్లాప్గా నిలిచింది. నిజానికి దీన్ని కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేద్దామని భావించారు. కానీ ఆ కొన్ని థియేటర్లలో రెస్పాన్స్ పెద్దగా రాకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించాడు.
