ప్రభన్యూస్

Railway Station: టికెట్ కౌంటర్ దగ్గర, వాటర్ కూలర్ వెనుక.. పార్సెల్ విభాగంలో.. ఆ రైల్వే స్టేషన్‌లో ఎక్కడ చూసినా పాములే..! |


Last Updated:

కాకినాడ తుని అత్యాధునిక రైల్వే స్టేషన్‌లో తరచూ పాములు కనిపించడంతో ప్రయాణికులు భయాందోళన, వీడియోలు వైరల్, భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్

+

News18

News18

పేరుకే కాదు.. రూపురేఖల పరంగా కూడా ఎయిర్‌పోర్ట్‌ను తలపించేలా అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఓ రైల్వే స్టేషన్ ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌లో ఎక్కడ చూసినా పాములు కనిపిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్టేషన్ శివార్లలో మాత్రమే కాదు.. టికెట్ కౌంటర్, వెయిటింగ్ హాల్, పార్సెల్ విభాగం వంటి ప్రయాణికులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లోనూ పాములు ప్రత్యక్షమవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

కాకినాడ జిల్లాలోని తుని రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అత్యాధునికంగా అభివృద్ధి చేసింది. విశాలమైన ప్రవేశ ద్వారాలు, ఆకర్షణీయమైన వెయిటింగ్ హాల్స్, ఆధునిక టికెట్ కౌంటర్లు, సిట్టింగ్ ఏరియాలు, పార్కింగ్ సదుపాయాలు, అందమైన లైటింగ్‌తో ఈ స్టేషన్‌కు కొత్త రూపు తీసుకొచ్చారు. మొదటిసారి చూసిన వారు ఇది రైల్వే స్టేషనా.. లేక చిన్న ఎయిర్‌పోర్టా అని ఆశ్చర్యపోయేలా ఈ నిర్మాణం ఉంది.

అయితే ఇటీవల ఈ స్టేషన్‌లో తరచూ పాములు కనిపిస్తుండటం ప్రయాణికులను కలవరపెడుతోంది. టికెట్ తీసుకునేందుకు కౌంటర్ వద్ద నిల్చున్న సమయంలోనే సమీపంలో పాము కనిపించడం, వెయిటింగ్ హాల్‌లోని వాటర్ కూలర్‌కు చుట్టుకుని పాములు ఉండటం, పార్సెల్ విభాగంలోనూ సర్పాలు సంచరిస్తుండటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రైలు కోసం వేచి ఉండే ప్రయాణికులు భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

స్టేషన్‌లో పాములు సంచరిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆధునిక సౌకర్యాలతో మెరిసిపోతున్న స్టేషన్‌లో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పాములు కనిపించడం భద్రతపై ఆందోళన పెంచుతోంది.

ఈ పరిస్థితిపై వెంటనే స్పందించాలని ప్రయాణికులు రైల్వే అధికారులను కోరుతున్నారు. స్టేషన్ పరిసరాల్లో పాములు సంచరించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పొదలను తొలగించడం, క్రమం తప్పకుండా పరిశుభ్రత నిర్వహించడం, సర్పాలను పట్టుకునే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన అత్యాధునిక రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు భయపడకుండా ప్రయాణించే వాతావరణం కల్పించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 June 2026, 9:59 pm Digital Edition : Prabhanews
Railway Station: టికెట్ కౌంటర్ దగ్గర, వాటర్ కూలర్ వెనుక.. పార్సెల్ విభాగంలో.. ఆ రైల్వే స్టేషన్‌లో ఎక్కడ చూసినా పాములే..! |

Last Updated:Jun 30, 2026 9:16 PM ISTకాకినాడ తుని అత్యాధునిక రైల్వే స్టేషన్‌లో తరచూ పాములు కనిపించడంతో ప్రయాణికులు భయాందోళన, వీడియోలు వైరల్, భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్+
News18పేరుకే కాదు.. రూపురేఖల పరంగా కూడా ఎయిర్‌పోర్ట్‌ను తలపించేలా అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఓ రైల్వే స్టేషన్ ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌లో ఎక్కడ చూసినా పాములు కనిపిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్టేషన్ శివార్లలో మాత్రమే కాదు.. టికెట్ కౌంటర్, వెయిటింగ్ హాల్, పార్సెల్ విభాగం వంటి ప్రయాణికులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లోనూ పాములు ప్రత్యక్షమవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.కాకినాడ జిల్లాలోని తుని రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అత్యాధునికంగా అభివృద్ధి చేసింది. విశాలమైన ప్రవేశ ద్వారాలు, ఆకర్షణీయమైన వెయిటింగ్ హాల్స్, ఆధునిక టికెట్ కౌంటర్లు, సిట్టింగ్ ఏరియాలు, పార్కింగ్ సదుపాయాలు, అందమైన లైటింగ్‌తో ఈ స్టేషన్‌కు కొత్త రూపు తీసుకొచ్చారు. మొదటిసారి చూసిన వారు ఇది రైల్వే స్టేషనా.. లేక చిన్న ఎయిర్‌పోర్టా అని ఆశ్చర్యపోయేలా ఈ నిర్మాణం ఉంది.అయితే ఇటీవల ఈ స్టేషన్‌లో తరచూ పాములు కనిపిస్తుండటం ప్రయాణికులను కలవరపెడుతోంది. టికెట్ తీసుకునేందుకు కౌంటర్ వద్ద నిల్చున్న సమయంలోనే సమీపంలో పాము కనిపించడం, వెయిటింగ్ హాల్‌లోని వాటర్ కూలర్‌కు చుట్టుకుని పాములు ఉండటం, పార్సెల్ విభాగంలోనూ సర్పాలు సంచరిస్తుండటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రైలు కోసం వేచి ఉండే ప్రయాణికులు భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.స్టేషన్‌లో పాములు సంచరిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆధునిక సౌకర్యాలతో మెరిసిపోతున్న స్టేషన్‌లో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పాములు కనిపించడం భద్రతపై ఆందోళన పెంచుతోంది.ఈ పరిస్థితిపై వెంటనే స్పందించాలని ప్రయాణికులు రైల్వే అధికారులను కోరుతున్నారు. స్టేషన్ పరిసరాల్లో పాములు సంచరించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పొదలను తొలగించడం, క్రమం తప్పకుండా పరిశుభ్రత నిర్వహించడం, సర్పాలను పట్టుకునే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన అత్యాధునిక రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు భయపడకుండా ప్రయాణించే వాతావరణం కల్పించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.Location :East Godavari,Andhra Pradeshమరింత చదవండి

Source link