Last Updated:
PM Modi: భారతదేశం సాంకేతిక స్వయంసమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని, దేశంలో ఇప్పటికే మూడు సెమీకండక్టర్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రక ఎర్రకోట బురుజుల పైనుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, రాబోయే కొన్నేళ్లలో మరో 5 నుంచి 8 నూతన సెమీకండక్టర్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. పీటీఐ కథనం ప్రకారం.. సెమీకండక్టర్ల రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. “దేశంలో మూడు సెమీకండక్టర్ తయారీ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. అక్కడ ప్రారంభమైన ఉత్పత్తి నుంచి విదేశాలకు ఎగుమతులు కూడా మొదలయ్యాయని నాకు సమాచారం అందింది. రాబోయే 7 నుంచి 8 ఏళ్లలో మరో 5 నుంచి 8 ప్లాంట్లు ఉత్పత్తిని ప్రారంభించనున్నాయని దేశ ప్రజలకు తెలియజేస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

