Last Updated:
NITI Aayog Report: దేశ యువతకు సంబంధించి నీతి ఆయోగ్ కీలక విషయాలను వెల్లడించింది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 8.7 కోట్ల మంది యువత చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణలో లేరని తాజా నివేదికలో పేర్కొంది. అసలు వీరి పరిస్థితి ఎలా ఉందో తెలుసా?
భారతదేశంలో యువతకు సంబంధించిన కీలక విషయాలను నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న సుమారు 8.7 కోట్ల మంది యువత చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణలో నిమగ్నమై లేరని అంచనా వేసింది. ఈ పరిస్థితిని మార్చేందుకు స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో పాటు, స్థానికంగా అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల అవసరాలు, అభివృద్ధి చెందుతున్న రంగాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో లేదా రాయితీతో కూడిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించింది.

