Last Updated:
Maharashtra: మహారాష్ట్రలోని అమరావతి, వర్ధా జిల్లాల్లో గత కొన్ని వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేసి, నలుగురు ప్రాణాలను బలిగొన్న ఆడపులి (Amravati tigress) చివరకు మృత్యువాతపడింది.
ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు మత్తుమందు (ట్రాంక్విలైజర్) ప్రయోగించి బంధించిన కొద్దిసేపటికే ఈ విషాద పరిణామం చోటుచేసుకోవడం స్థానికంగా, వన్యప్రాణి ప్రేమికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా అమరావతి, వర్ధా జిల్లాల సరిహద్దు గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాల్లో ఈ పులి సంచరిస్తూ తీవ్ర భయాందోళనలు సృష్టించింది. కేవలం మనుషులపైనే కాకుండా పశువుల మందలపై కూడా విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

