అయితే సింగ్ ప్రీమియంలు చెల్లిస్తూనే ఉన్నప్పటికీ, 2011 అక్టోబర్ 5న LIC ఆ పాలసీని రూ.2,26,325కు సరెండర్ చేసింది. ఈ మొత్తాన్ని IDBI బ్యాంకుకు పంపినట్లు నివేదిక పేర్కొంది. తన అనుమతి లేకుండా పాలసీని సరెండర్ చేశారని సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను సరెండర్ కోసం ఎలాంటి అభ్యర్థన చేయలేదని చెబుతూ పాలసీని తిరిగి కొనసాగించాలని కోరారు. LIC పాలసీని పునరుద్ధరించేందుకు అంగీకరించకపోవడంతో సింగ్ సోనిపత్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు. 2015 ఫిబ్రవరి 4న జిల్లా కమిషన్ సింగ్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. డిఫాల్ట్ అయిన కాలానికి సంబంధించిన ప్రీమియంలను వడ్డీతో స్వీకరించి పాలసీని పునరుద్ధరించాలని LICని ఆదేశించింది. అదే సమయంలో, 2011 అక్టోబర్ 5 నుంచి 9 శాతం వార్షిక వడ్డీతో రూ.2,26,325 మొత్తాన్ని LICకి తిరిగి చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. మానసిక వేదనకు రూ.10,000 పరిహారం, వ్యాజ్య ఖర్చులు కూడా చెల్లించాలని జిల్లా కమిషన్ పేర్కొంది.
