Last Updated:
శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులతో ప్రధాని మోదీ సరదాగా మాట్లాడారు. జెన్ జీ యువతను ఆకట్టుకునేలా ఓజీ, ధురందర్ లాంటి ట్రెండీ పదాలు వాడుతూ 2013 నాటి పరిస్థితులను, నేటి భారత ఆర్థిక ప్రగతిని వివరించారు.
దాదాపు 13 ఏళ్ల తర్వాత ఢిల్లీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్సార్సీసీ) వార్షికోత్సవ సభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నేటి యువతరం (జెన్ జీ) మాట్లాడే ఆధునిక పదజాలంతో ప్రసంగించి విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నారు. కాలేజీ పూర్వ విద్యార్థుల ఘనతను కొనియాడుతూ.. మీ భాషలో చెప్పాలంటే వారంతా అసలైన ‘ఓజీ’లు అంటూ చమత్కరించారు. రీసెంట్గా పాపులర్ అయిన ‘ధురందర్’ సినిమాను ప్రస్తావిస్తూ.. మీరు ధురందర్ కాకపోయినా పర్లేదు గానీ మీకంటూ ఒక ప్రత్యేక ప్రభావం చూపించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

