ఈ బృహత్తరమైన జాబ్ మేళాలో దేశవిదేశాలకు చెందిన పలు పేరుగాంచిన బహుళజాతి కంపెనీలు పాల్గొంటున్నాయి. యూత్ ఫర్ జాబ్స్, యాక్సిస్ బ్యాంక్ (ఎన్ఐఐటీ), టాటా ఏఐజీ, ట్రైస్టార్ మోటార్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, విస్తార్ ఫైనాన్షియల్ సంస్థలు వస్తున్నాయి. నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎన్.ఎస్ ఇన్స్ట్రుమెంట్స్, టి.హెచ్.కె ఇండియా, వెర్మీరన్, హీరో, కియా ఇండియా (క్వెస్ కార్ప్), అపోలో ఫార్మసీ తదితర సంస్థలు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకోనున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, ఎంబీఏ చదివిన వారు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. పీసీఐ సర్టిఫికెట్ ఉన్న బీ-ఫార్మసీ, డీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులకు సైతం ఇందులో మంచి అవకాశాలు ఉన్నాయి.

