ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకుంటున్న చర్యలను కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది. 2017లో ఆర్బీఐ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ (CFL) ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రజల భాగస్వామ్యంతో, స్థానిక స్థాయిలో ఆర్థిక విద్యను అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దేశవ్యాప్తంగా 2,421 సెంటర్స్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ (CFLs) ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్కో కేంద్రం సగటున మూడు బ్లాక్ల పరిధిలో పనిచేస్తుంది. ఈ కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లు, ప్రభుత్వ ఆర్థిక పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆర్బీఐ ఆర్థిక అవగాహన కేంద్రాలు, గ్రామీణ బ్యాంక్ శాఖలు జిల్లా, పంచాయతీ, గ్రామ స్థాయి అధికారులతో కలిసి బయట ప్రాంతాల్లో ఆర్థిక అవగాహన శిబిరాలు నిర్వహించాలని సూచించింది. రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

