ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. ప్రస్తుతం రైల్వే రిజర్వేషన్ విధానంలో గర్భిణీ మహిళలకు లోయర్ బెర్త్ కేటాయింపులో ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఆ ప్రయోజనాన్ని ఆన్లైన్లో సులభంగా పొందేందుకు ఐఆర్సిటిసి ప్లాట్ఫారమ్లో స్పష్టమైన వ్యవస్థ కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. ఈ అంశంపై అనూనయ్ సహాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)ను విచారించిన కోర్టు, కేంద్ర ప్రభుత్వం, రైల్వే బోర్డు, ఐఆర్సిటిసిలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది. అయితే ప్రస్తుతం గర్భిణీ మహిళలకు ఆన్లైన్లో తప్పనిసరిగా లోయర్ బెర్త్ కేటాయించాలని కోర్టు తుది ఆదేశం ఇచ్చినట్లు భావించకూడదు. రైల్వే నుంచి వివరణ తీసుకున్న తర్వాత ఈ అంశంపై తదుపరి నిర్ణయం తీసుకోనుంది.(AI IMAGE)

