ప్రభన్యూస్

Fishermen Missing: ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. జోరుగా సెర్చ్ ఆపరేషన్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Fishermen Missing: గంగ పుత్రులు సంద్రంలో చేపల వేటకు వెళ్లి.. తిరిగి రాకపోవడం అత్యంత విచారకరం.. వారి కోసం కోట్ల గుండెలు ఎదురుచూస్తున్నాయి. క్షేమంగా రావాలని కోరుకుంటన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి జులై 1న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు ఉత్తరాంధ్ర మత్స్యకారులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.

వివరాలు:

ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి IND-AP-MM-V5-83 నంబర్ బోటుపై ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వారిలో ఆరుగురు విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందినవారు. లాకు అప్పలరాజు, బండియ్య, గరగయ్య, సీతుడు, చిన్న అమ్మోరు, కారి చిన్న, మరొకరు. ఇంకొకరు విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం చెందిన చిన్నయ్య. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబం నుంచి ఉన్నట్లు తెలిసింది. ఆ బోటు కూడా వారి సొంతమే. ఈమధ్యే కొత్త బోటు, సామగ్రి కోసం 20 లక్షలు ఖర్చు చేశారని కుటుంబాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి: Cabinet Reshuffle: ఉప ప్రధానిగా అమిత్ షా? పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్రం భారీ ప్లాన్!

జులై 4వ తేదీ మధ్యాహ్నం కల్లా తిరిగి వస్తామని కుటుంబాలకు మత్స్యకారులు ఫోన్ చేసి చెప్పారు. కానీ సాయంత్రం దాటినా బోటు హార్బర్‌కు చేరుకోలేదు. ఆ తర్వాత వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అల్పపీడనం కారణంగా సముద్రం ప్రతికూల వాతావరణం ఉండటంతో బోటు తిరగబడి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. మత్స్యశాఖ అధికారులు, కోస్ట్ గార్డ్ యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు ప్రారంభించారు. నేవీ సహకారంతో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన సెర్చ్ చేపట్టాలని ఆదేశించారు. కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకిరామ్ కూడా అధికారులను కలిసి తక్షణం హెలికాప్టర్లు, నౌకలు, ఆధునిక సాంకేతికతతో సెర్చ్ ముమ్మరం చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించి నిరంతరం అప్‌డేట్ ఇవ్వాలని ఆదేశించారు. హెలికాప్టర్లతో సెర్చ్ చెయ్యమని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: Gold Price: పాతాళానికి పడనున్న బంగారం ధరలు.. పెట్టుబడులు పెట్టేవారికి బిగ్ అలర్ట్!

ఈ ఘటన ఉత్తరాంధ్ర మత్స్యకారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. జాలారిపేట, జబ్బర్ తోట ప్రాంతాల్లో నివసించే కుటుంబ సభ్యులు హార్బర్ దగ్గర ఆందోళన చెందుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో వారు ఎక్కడికైనా క్షేమంగా చేరారా లేదా అనే ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. అల్పపీడనం కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు కానీ వారు అల్పపీడనం ఏర్పడకముందే వారు వేటకు వెళ్లారు.

బంగాళాఖాతంలో జులై 2న ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో సముద్రంలో ప్రయాణం ప్రమాదకరం. ఇటీవలి సంవత్సరాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కోస్ట్ గార్డ్ సమర్థవంతంగా రెస్క్యూ చేసింది. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్‌లో హెలికాప్టర్లు, నౌకలు ఉపయోగపడే అవకాశం ఉంది. మత్స్యశాఖ అధికారులు కుటుంబాలకు నిరంతరం సమాచారం అందిస్తున్నారు.

ఈ ఘటన మత్స్యకారుల భద్రత, వాతావరణ హెచ్చరికల పాటించడం అవసరమని మరోసారి గుర్తు చేస్తోంది. అధికారులు సెర్చ్‌ను తీవ్రం చేసి, మిగతా ఆరుగురిని సురక్షితంగా రక్షించాలని కుటుంబాలు, స్థానిక నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వం, రెస్క్యూ టీములు పూర్తి సమన్వయంతో పని చేస్తున్నాయి. ఈ ఎదురుచూపులు త్వరగా ముగిసి మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నాయి స్థానిక కుటుంబాలు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 July 2026, 11:07 am Digital Edition : Prabhanews
Fishermen Missing: ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. జోరుగా సెర్చ్ ఆపరేషన్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 05, 2026 11:03 AM ISTFishermen Missing: గంగ పుత్రులు సంద్రంలో చేపల వేటకు వెళ్లి.. తిరిగి రాకపోవడం అత్యంత విచారకరం.. వారి కోసం కోట్ల గుండెలు ఎదురుచూస్తున్నాయి. క్షేమంగా రావాలని కోరుకుంటన్నాయి. ప్రతీకాత్మక చిత్రంబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి జులై 1న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు ఉత్తరాంధ్ర మత్స్యకారులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.వివరాలు:ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి IND-AP-MM-V5-83 నంబర్ బోటుపై ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వారిలో ఆరుగురు విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందినవారు. లాకు అప్పలరాజు, బండియ్య, గరగయ్య, సీతుడు, చిన్న అమ్మోరు, కారి చిన్న, మరొకరు. ఇంకొకరు విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం చెందిన చిన్నయ్య. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబం నుంచి ఉన్నట్లు తెలిసింది. ఆ బోటు కూడా వారి సొంతమే. ఈమధ్యే కొత్త బోటు, సామగ్రి కోసం 20 లక్షలు ఖర్చు చేశారని కుటుంబాలు తెలిపాయి.ఇవి కూడా చదవండి: Cabinet Reshuffle: ఉప ప్రధానిగా అమిత్ షా? పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్రం భారీ ప్లాన్!జులై 4వ తేదీ మధ్యాహ్నం కల్లా తిరిగి వస్తామని కుటుంబాలకు మత్స్యకారులు ఫోన్ చేసి చెప్పారు. కానీ సాయంత్రం దాటినా బోటు హార్బర్‌కు చేరుకోలేదు. ఆ తర్వాత వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అల్పపీడనం కారణంగా సముద్రం ప్రతికూల వాతావరణం ఉండటంతో బోటు తిరగబడి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. మత్స్యశాఖ అధికారులు, కోస్ట్ గార్డ్ యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు ప్రారంభించారు. నేవీ సహకారంతో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన సెర్చ్ చేపట్టాలని ఆదేశించారు. కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకిరామ్ కూడా అధికారులను కలిసి తక్షణం హెలికాప్టర్లు, నౌకలు, ఆధునిక సాంకేతికతతో సెర్చ్ ముమ్మరం చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించి నిరంతరం అప్‌డేట్ ఇవ్వాలని ఆదేశించారు. హెలికాప్టర్లతో సెర్చ్ చెయ్యమని ఆదేశించారు.ఇవి కూడా చదవండి: Gold Price: పాతాళానికి పడనున్న బంగారం ధరలు.. పెట్టుబడులు పెట్టేవారికి బిగ్ అలర్ట్!ఈ ఘటన ఉత్తరాంధ్ర మత్స్యకారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. జాలారిపేట, జబ్బర్ తోట ప్రాంతాల్లో నివసించే కుటుంబ సభ్యులు హార్బర్ దగ్గర ఆందోళన చెందుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో వారు ఎక్కడికైనా క్షేమంగా చేరారా లేదా అనే ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. అల్పపీడనం కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు కానీ వారు అల్పపీడనం ఏర్పడకముందే వారు వేటకు వెళ్లారు.బంగాళాఖాతంలో జులై 2న ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో సముద్రంలో ప్రయాణం ప్రమాదకరం. ఇటీవలి సంవత్సరాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కోస్ట్ గార్డ్ సమర్థవంతంగా రెస్క్యూ చేసింది. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్‌లో హెలికాప్టర్లు, నౌకలు ఉపయోగపడే అవకాశం ఉంది. మత్స్యశాఖ అధికారులు కుటుంబాలకు నిరంతరం సమాచారం అందిస్తున్నారు.ఈ ఘటన మత్స్యకారుల భద్రత, వాతావరణ హెచ్చరికల పాటించడం అవసరమని మరోసారి గుర్తు చేస్తోంది. అధికారులు సెర్చ్‌ను తీవ్రం చేసి, మిగతా ఆరుగురిని సురక్షితంగా రక్షించాలని కుటుంబాలు, స్థానిక నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వం, రెస్క్యూ టీములు పూర్తి సమన్వయంతో పని చేస్తున్నాయి. ఈ ఎదురుచూపులు త్వరగా ముగిసి మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నాయి స్థానిక కుటుంబాలు.Location :Hyderabad,TelanganaFirst Published :Jul 05, 2026 11:01 AM ISTమరింత చదవండి

Source link