ప్రభన్యూస్

Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌ చిరంజీవి.. ఇదిగో మెగాస్టార్ టీమ్ క్లారిటీ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని వార్తా పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై మెగాస్టార్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

News18
News18

మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని వార్తా పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను చిరంజీవి అధికారిక పీఆర్ టీమ్ తీవ్రంగా ఖండించింది. ఇదంతా కేవలం ఫేక్ న్యూస్ అని స్పష్టం చేస్తూ అభిమానులకు, ప్రజలకు క్లారిటీ ఇచ్చింది.

అవాస్తవాలను నమ్మొద్దు.. టీమ్ అధికారిక ప్రకటన:

ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే భారీ ఎత్తున జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిరంజీవికి ఉన్న అపారమైన ప్రజాదరణను వినియోగించుకోవాలని భావిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఆయనకు ఏపీ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగించనున్నారని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన చిరు టీమ్.. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి అలాంటి ప్రతిపాదన ఏమీ రాలేదని, దయచేసి ఇలాంటి ధ్రువీకరించని, అసత్య వార్తలను ప్రచారం చేయవద్దని కోరింది. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేయడంతో ఈ వదంతులకు చెక్ పడినట్లైంది.

రాజకీయాలకు దూరం.. సినిమాలపైనే పూర్తి దృష్టి:

రాజకీయాల నుంచి తప్పుకుని, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత చిరంజీవి తన పూర్తి కాలాన్ని కేవలం సినిమాలకే కేటాయిస్తున్నారు. యువ కథానాయకులకు ఏమాత్రం తీసిపోని విధంగా, జెట్ స్పీడ్‌తో ఒకదాని తర్వాత ఒకటి వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తే మెగా అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.

చిరంజీవి ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన పవర్‌ఫుల్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. హై-వోల్టేజ్ విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను దసరా పండుగ కానుకగా అక్టోబరు 16న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 4:44 pm Digital Edition : Prabhanews
Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌ చిరంజీవి.. ఇదిగో మెగాస్టార్ టీమ్ క్లారిటీ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 06, 2026 4:36 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని వార్తా పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై మెగాస్టార్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. News18మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని వార్తా పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను చిరంజీవి అధికారిక పీఆర్ టీమ్ తీవ్రంగా ఖండించింది. ఇదంతా కేవలం ఫేక్ న్యూస్ అని స్పష్టం చేస్తూ అభిమానులకు, ప్రజలకు క్లారిటీ ఇచ్చింది.అవాస్తవాలను నమ్మొద్దు.. టీమ్ అధికారిక ప్రకటన:ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే భారీ ఎత్తున జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిరంజీవికి ఉన్న అపారమైన ప్రజాదరణను వినియోగించుకోవాలని భావిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఆయనకు ఏపీ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగించనున్నారని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన చిరు టీమ్.. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి అలాంటి ప్రతిపాదన ఏమీ రాలేదని, దయచేసి ఇలాంటి ధ్రువీకరించని, అసత్య వార్తలను ప్రచారం చేయవద్దని కోరింది. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేయడంతో ఈ వదంతులకు చెక్ పడినట్లైంది.రాజకీయాలకు దూరం.. సినిమాలపైనే పూర్తి దృష్టి:రాజకీయాల నుంచి తప్పుకుని, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత చిరంజీవి తన పూర్తి కాలాన్ని కేవలం సినిమాలకే కేటాయిస్తున్నారు. యువ కథానాయకులకు ఏమాత్రం తీసిపోని విధంగా, జెట్ స్పీడ్‌తో ఒకదాని తర్వాత ఒకటి వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తే మెగా అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.చిరంజీవి ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన పవర్‌ఫుల్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. హై-వోల్టేజ్ విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను దసరా పండుగ కానుకగా అక్టోబరు 16న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link