Last Updated:
లక్షలు కురిపిస్తున్న ఇడ్లీలు, దోశలు.. కేవలం ఒక్క బ్రాంచీతో నెలకు 10 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో చూశారా!
మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు బలవర్థకమైన ఆహారం వైపు పరుగులు తీస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సంస్కృతికి స్వస్తి పలికి పాతతరం పౌష్టికాహారానికి పెద్దపీట వేస్తున్నారు. ఇడ్లీ, దోశ లాంటి నిత్యం తినే అల్పాహారాల్లో కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే వెరైటీలు కోరుకుంటున్నారు. సరిగ్గా ఈ కాలానుగుణ మార్పును పసిగట్టిన గుంటూరుకు చెందిన సుధీర్ అనే యువకుడు ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చారు. ‘వాసెనపోలి’ అనే సరికొత్త ఫుడ్ స్టార్టప్కు శ్రీకారం చుట్టి ఆహార ప్రియుల మన్ననలు విశేషంగా పొందుతున్నారు. కేవలం వ్యాపారమే ఏకైక లక్ష్యంగా కాకుండా, జనాలకు ఆరోగ్యాన్ని పంచడంతో పాటు సామాజిక బాధ్యతను కూడా మేళవించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

