కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులు, రైల్వే ప్రాంగణాల్లో ఉన్న ఇతర వ్యక్తులు స్టేషన్లు, రైల్వే ప్లాట్ఫారాలు లేదా రైలు బోగీల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదు. చెత్త వేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో మాత్రమే వేయాలి. కొన్ని ఇతర పనులపైనా నిషేధం ఉంది. వాటికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంటే తప్ప వాటిని చేయకూడదు. వంట చేయడం, స్నానం చేయడం, ఉమ్మివేయడం, మూత్ర విసర్జన చేయడం, మల విసర్జన చేయడం, జంతువులు లేదా పక్షులకు ఆహారం పెట్టడం, వాహనాలు కడగడం, పాత్రలు లేదా బట్టలు ఉతకడం, రైల్వే ప్రాంగణాల్లో వస్తువులను నిల్వ చేయడం వంటివి ఇందులో ఉన్నాయి అని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
