Last Updated:
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖావడ్యా కొండల్లో మొబైల్ ఫోన్ కోసం వెళ్లి కాలుజారి లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ పరిధిలో ఉన్న ఖావడ్యా కొండల వద్ద అత్యంత హృదయ విదారక ఘటన జరిగింది. కేవలం ఒక ఐఫోన్ ఈఎంఐ (EMI) కట్టేందుకు డబ్బుల విషయంలో జరిగిన గొడవ ఏకంగా మూడు ప్రాణాలను బలితీసుకుంది. జల్తా ఫాటా ప్రాంతానికి చెందిన మురళీధర్ చంద్గుడే (48), అతడి భార్య సంగీత, 19 ఏళ్ల కుమారుడు కునాల్ చంద్గుడే ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. న్యూస్18 ఇంగ్లీష్ ప్రకారం.. ఇటీవలే కునాల్ ఈఎంఐ పద్ధతిలో ఖరీదైన ఐఫోన్ కొనుగోలు చేశాడు. దాని ఇన్స్టాల్మెంట్ చెల్లించడానికి డబ్బులు కావాలని అతడు తన తల్లిదండ్రులను అడిగాడు.

