దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, కేంద్ర–రాష్ట్రాల సమస్యల పరిష్కారం, ప్రాంతీయ అభివృద్ధిపై కీలక చర్చలకు వేదికగా 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కోవలం ప్రాంతంలోని తాజ్ ఫిషర్మ్యాన్స్ కోవ్ హోటల్లో గురువారం ఈ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి తరఫున డీకే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి, ప్రతినిధులు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు/ప్రతినిధులు, పుదుచ్చేరి సహా సభ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు.

