నేడు ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని విద్యాసంస్థలకు శుక్రవారం కలెక్టర్ రాజర్షిషా సెలవు ప్రకటించారు. నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు. ఈ సెలవును ఆగస్టు ఎనిమిదో తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా పరిగణించాలని సూచించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలని కోరారు. వర్షాల దృష్ట్యా విద్యార్థులు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
