భారతదేశానికి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఆస్తులు కొని ప్రపంచ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా మొదలు.. విజయ్ మాల్యా, అదార్ పూనావాలా వంటి బడా వ్యాపారవేత్తల వరకు అనేక మంది సెలబ్రిటీలు విదేశీ గడ్డపై రియల్ ఎస్టేట్లో వందల, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. దుబాయ్లోని అత్యద్భుతమైన ప్రైవేట్ బీచ్ విల్లా, లండన్లోని చారిత్రక వారసత్వ భవనాలు, ఫ్రాన్స్లోని ప్రైవేట్ దీవి, అమెరికాలోని ఖరీదైన మాన్షన్ ఇలా వీరు కొన్న ఆస్తుల జాబితా ఎంతో ఆకట్టుకుంటుంది. ఫైనాన్షియల్ టైమ్స్, ఫోర్బ్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల రిపోర్టుల ఆధారంగా విదేశాల్లోని 7 అత్యంత ఖరీదైన ఆస్తుల వివరాలు ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందాం.

