ఇంతకుముందు పార్లమెంట్ ప్రశ్నలకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, డార్మంట్ ఈపీఎఫ్ ఖాతాల్లో ఉన్న మొత్తం భారీగా పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.1,638.37 కోట్లుగా ఉన్న మొత్తం 2024 ఆర్థిక సంవత్సరానికి ఐదు రెట్లకు పైగా పెరిగి రూ.8,505.23 కోట్లకు చేరింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ముగింపు బ్యాలెన్స్ సున్నాగా ఉన్న ఖాతాల సంఖ్య 1,32,40,542గా ఉంది. ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న ఈ చర్యల వల్ల చాలాకాలంగా అందకుండా ఉన్న పీఎఫ్ డబ్బు సరైన ఖాతాదారులకు చేరే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా చిన్న మొత్తాల కోసం దరఖాస్తులు, కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తగ్గి, డిజిటల్ విధానంలో డబ్బు తిరిగి పొందే సౌకర్యం అందుబాటులోకి రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)

