ఈ నిరసనకు కొనసాగింపుగా, 20వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తలు, విద్యార్థులు.. వేల మంది గుంపులుగా.. పార్లమెంటు వైపు మార్చ్ చేశారు. ఆ సమయంలో, పోలీసులు, భద్రతా దళాలు జరిపిన లాఠీచార్జిలో చాలా మంది విద్యార్థులు గాయపడగా, నిరసనకారుల ప్రతీకార దాడిలో పోలీసులు కూడా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చగా మారింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.

