పథకం వివరాల ప్రకారం, కార్పెట్ ఏరియా 400 స్క్వేర్ ఫీట్, బిల్టప్ ఏరియా 528 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి వంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ లొకేషన్లలో మొత్తం వేల ఫ్లాట్లను ప్రభుత్వం నిర్మించి.. పేదలకు ఇస్తుంది ఉదాహరణకు రాజేంద్రనగర్లో మైలార్దేవరపల్లిలో 480 ఫ్లాట్లు, నాంపల్లిలో 120 ఫ్లాట్లు ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు రూ.100. దీన్ని తిరిగి వెనక్కి ఇవ్వరు. EMD/Tokan అడ్వాన్స్ రూ.10,000. ఇల్లు వద్దనుకుంటే ఈ డబ్బును వెనక్కి ఇస్తారు. ఎన్ని దరఖాస్తులు తీసుకుంటారు అనేది.. అసెంబ్లీ నియోజకవర్గం ఆధారంగా ఉంటుంది. మీసేవా వెబ్సైట్, MeeSeva WhatsApp (8096958096) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఆగస్టు 2026 వరకు ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు.

