“సామాజిక భద్రత అంటే కష్టాలు వచ్చినప్పుడు రక్షణ కల్పించడం మాత్రమే కాదు. కుటుంబాలు దీర్ఘకాలంలో ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన నమ్మకం, స్థిరత్వాన్ని ఇవ్వడం కూడా” అని ఆయన చెప్పారు. పెన్షన్పై అవగాహన, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిజాయితీ, పారదర్శకత, నమ్మకం ఆధారంగా ఉండాలని కన్సాల్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు స్పష్టమైన, పారదర్శకమైన సమాచారం అందించాలి. అప్పుడే వారు తమ దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోగలరని చెప్పారు. మమతా శంకర్ మాట్లాడుతూ, ప్రజల ఆయుర్దాయం పెరగడం, జనాభా నిర్మాణంలో మార్పులు రావడంతో రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రాధాన్యం మరింత పెరుగుతోందని చెప్పారు. అధికారిక రిటైర్మెంట్, సామాజిక భద్రత వ్యవస్థలకు ఇంకా దూరంగా ఉన్న గ్రామీణ కుటుంబాల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) సహా వివిధ పెన్షన్ ఉత్పత్తులపై అవగాహన, వాటి వినియోగం గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. (image: AI Generated)

