Last Updated:
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది.
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. కొంతకాలంగా సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కబోతుందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక సినిమాలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రను నటి రష్మిక మందన్న పోషించనున్నట్లు ప్రకటించారు.

