కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వాటి క్షేత్రస్థాయి యూనిట్లలో పనిచేస్తున్న లేదా రిటైర్ అయిన అధికారులు, ఉద్యోగులు కూడా PM-KMYలో చేరలేరు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (PSEలు), అనుబంధ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో పనిచేసేవారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. స్థానిక సంస్థల్లో రెగ్యులర్ ఉద్యోగులు కూడా అర్హులు కాదు. అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), క్లాస్ IV, గ్రూప్ D ఉద్యోగులకు ఈ మినహాయింపు వర్తించదు. వారు PM-KMYలో చేరేందుకు అర్హులుగానే ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)

