CM Chandrababu Naidu tour: నేడు సీఎం చంద్రబాబు దోర్నాల పర్యటన.. 4 జిల్లాలకు దాహార్తిని తీర్చడంపై ఫోకస్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
సీఎం చంద్రబాబు పర్యటన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం: మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు దాహార్తిని తీర్చే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 4 జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అయితే, ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులు, నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం…
