గర్భిణీ మృతి పై ఆసుపత్రి యాజమాన్యం కారణం కాదు.
ఎమ్మిగనూరు,జూలై20(ప్రభన్యూస్): 9నెలల గర్భిణీ మృతి చెందిన ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ గర్భిణి వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి రాకముందునే పేషెంట్ పరిస్థితి సీరియస్ గా ఉందిని,మేము వెంటనే స్పందించి ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని తెలిసిన వెంటనే శ్వాస కు సంబందించిన వైద్యులను ఆసుపత్రి కి పిలిపించామని తెలిపారు.అయితే పేసెంట్ పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఆదోని హాస్పటల్ కు రెఫర్ చేశామన్నారు. ఆదోనికి వెళ్లుచుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినది మాకు సమాచారం అందిందని,ఆమె మృతికి మేము కారణం కాదని వారు తెలిపారు.

